త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | ప‌ర‌కాల‌లో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్.. శంకుస్థాప‌న చేసిన సీఎం

Revanth Reddy | ములుగు జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి హ‌నుమ‌కొండ జిల్లా ప‌ర‌కాల ప‌ట్ట‌ణంలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. ఇప్ప‌టికే నిర్మాణం పూర్తి చేసుకున్న వాటిని అట్ట‌హాసంగా ప్రారంభించారు.

S

Telangana | Published On Aug 16, 2026, 6.35 pm IST

Revanth Reddy | ప‌ర‌కాల‌లో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్.. శంకుస్థాప‌న చేసిన సీఎం
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ములుగు జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి హ‌నుమ‌కొండ జిల్లా ప‌ర‌కాల ప‌ట్ట‌ణంలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. ఇప్ప‌టికే నిర్మాణం పూర్తి చేసుకున్న వాటిని అట్ట‌హాసంగా ప్రారంభించారు. రూ.200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులతో పాటు రూ.82 కోట్లతో పరకాల మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆయ‌న వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారు.

ప‌రకాల నియోజ‌క‌వ‌ర్గంలో శంకుస్థాప‌న చేసిన ప‌నుల వివ‌రాలివే..

  • రూ.65 కోట్లతో పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం
  • రూ.45.15 కోట్లతో అడ్వాన్డ్స్‌ టెక్నాలజీ సెంటర్ (ATC) నిర్మాణం
  • రూ.32.17 కోట్ల అంచనా వ్యయంతో దామెర మండలం ల్యాదేళ్లలో పరకాల ఇందిరా మహిళా డెయిరీ ప్లాంట్‌కు శంకుస్థాపన
  • రూ.10 కోట్ల అంచనా వ్యయంతో అక్కంపేట గ్రామంలో అభివృద్ధి ప్రణాళిక పనులకు శంకుస్థాపన
  • రూ.5 కోట్లతో కుంకుమేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులు
  • ఆత్మకూర్‌లో టౌన్ షిప్ అండర్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌కు శంకుస్థాపన
  • పరకాల పట్టణంలో రూ.3 కోట్లతో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు
  • రూ.1.10 కోట్లతో విద్యుత్ డివిజనల్ ఇంజినీర్ కార్యాలయం నిర్మాణం

ఇవీ ప్రారంభోత్సవాలు..

  • పరకాలలో రూ.35 కోట్లతో నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రి ప్రారంభం
  • ఆత్మకూర్‌లో రూ.కోటితో నిర్మించిన అధునాతన SPM సెంటర్ ప్రారంభం
  • పరకాలలో రూ.5 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం ప్రారంభం
Advertisement

తాజావార్తలు

Advertisement