త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nabha Natesh | జీవితాన్నే మలుపు తిప్పుతుంది.. ‘స్వయంభు’ పాత్ర గురించి చెప్పేసిన నభా నటేశ్‌..!

Nabha Natesh | నిఖిల్‌ సిద్ధార్థ్‌ హీరోగా దర్శకుడు భరత్‌ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న పీరియాడిక్‌ మూవీ స్వయంభు. ఈ మూవీలో నభా నటేశ్ ఈ మూవీలో సంయుక్తతో కలిసి కీలకపాత్రలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. మూవీలోని పాత్ర గురించి చెప్పుకొచ్చింది.

P

Entertainment | Published On Mar 17, 2026, 3.12 pm IST

Nabha Natesh | జీవితాన్నే మలుపు తిప్పుతుంది.. ‘స్వయంభు’ పాత్ర గురించి చెప్పేసిన నభా నటేశ్‌..!
Advertisement

Nabha Natesh | నిఖిల్‌ సిద్ధార్థ్‌ హీరోగా దర్శకుడు భరత్‌ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న పీరియాడిక్‌ మూవీ స్వయంభు. ఈ మూవీలో నభా నటేశ్ ఈ మూవీలో సంయుక్తతో కలిసి కీలకపాత్రలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. మూవీలోని పాత్ర గురించి చెప్పుకొచ్చింది. మూవీలో హీరోకు బ్యాక్‌బోన్‌గా నిలిచే పాత్రను తాను పోషిస్తున్నట్లు వెల్లడించింది. ‘మూవీలో సుందరవల్లి పాత్రను పోషిస్తున్నాను. ఆమె ఒక శాస్త్రీయ నృత్యకళాకారిణి. హీరోతో పాటు అదే గ్రామంలో పెరుగుతుంది. అతని జీవితంలో కష్టనష్టాలు, బలాలు బలహీనతలన్నీ ఆమెకు తెలుసు. అతనికి ఓ నీడలా ఉంటూ అండగా ఉంటుంది. ఓ వ్యక్తి విజయవంతం కావాలంటే ఒకరు అతని వెనకాలే ఉండి మద్దతుగా నిలువాలి.

మనం సక్సెస్‌ అయిన వారిని గమనించం. కానీ, వారు కష్టకాలంలో ఉన్నప్పుడు వారికి ఎవ‌రో ఒక‌రు మద్దతుగా నిలిచి సహాయం అందిస్తారు. నా పాత్ర కూడా అలాంటిదే. ఒక వ్యక్తి కుంగిపోయినప్పుడు వారికి అండగా నిలిచి వారిలో భావోద్వేగాల్ని తట్టిలేపాలి. వారు ముందుకు సాగేలా ప్రేరేపించాలి. అప్పుడు అన్ని విషయాలపై స్పష్టమైన అవగాహన ఉంటుంది. నేను ఈ మూవీలో అలాంటి పాత్రనే పోషిస్తున్నాను. మరో మాటలో చెప్పాలంటే సుందరవల్లి అనే పాత్ర హీరో కష్టకాలంలో ఉన్నప్పుడు, ఆమె అతనికి విశ్వాసాన్ని ఇచ్చి కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు ప్రేరేపిస్తుంది. ఆ సంఘటన తరువాత కథలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆ తర్వాత అతను తన లక్ష్యాన్ని విజయవంతంగా సాధిస్తాడు’ అంటూ న‌భా న‌టేశ్‌ వివరించింది.

ఇదిలా ఉండగా.. స్వయంభు ఈ ఏడాది ఆసక్తిగా అభిమానులు ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీ ప్రస్తుతం ఈ ఏడాది అత్యంత ఆశించబడిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. భువన్, శ్రీకర్ నిర్మించిన స్వయంభును పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై నిర్మించారు. టాగోర్ మధు పరిచయం చేస్తున్నారు. హీరో నిఖిల్ సిద్ధార్థ్ చిత్రానికి ముందు వియత్నాం వెళ్లి మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పొందాడు. అతను కత్తి యుద్ధంలో ప్రావీణ్యం సాధించాడు. అలాగే, మరికొందరు నటీనటులు, హీరోయిన్లు సైతం శిక్షణ తీసుకున్నారు.

వియత్నాం నిపుణుల బృందాన్ని హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోస్‌కు ఆహ్వానించి, స్టంట్ కళాకారులకు శిక్షణ ఇచ్చారు. క్లైమాక్స్ సన్నివేశం 60 రోజుల పాటు షూట్ చేశారు. ఇందులో వందల మంది కళాకారులు పాల్గొన్నారు. గత ఏడాది నవంబర్‌లో చిత్ర బృందం షూటింగ్‌ పూర్తయ్యిందని ప్రకటించింది. ప్రస్తుతం స్వయంభు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. స్వయంభు భారతీయ సాంస్కృతిక వారసత్వానికి మూలాలు కలిగిన చిత్రమని, ఇది గతంలో ఎవరూ చూపించని సరికొత్త అధ్యాయాన్ని తెరపై చూపించనున్నట్లు మేకర్స్‌ పేర్కొన్నారు. ఈ మూవీ ఏప్రిల్‌ 10న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలకానుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement