త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Keerthy Suresh | కీర్తి సురేష్ త‌మిళ‌ క్రైమ్ కామెడీ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది – తెలుగులోనూ రిలీజ్‌

Keerthy Suresh | కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించిన క్రైమ్ కామెడీ మూవీ రివాల్వ‌ర్ రీటా ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. డిసెంబ‌ర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు త‌మిళంలో స్ట్రీమింగ్ కాబోతుంది.

N

Entertainment | Published On Dec 18, 2025, 8.26 pm IST

Keerthy Suresh | కీర్తి సురేష్ త‌మిళ‌ క్రైమ్ కామెడీ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది – తెలుగులోనూ రిలీజ్‌

Keerthy Suresh

Advertisement

కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించిన లేటెస్ట్‌ క్రైమ్ కామెడీ మూవీ రివాల్వ‌ర్ రీటా థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీ నెల రోజులు కాక‌ముందే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. డిసెంబ‌ర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. త‌మిళంతో పాటు తెలుగులోనూ విడుద‌ల అవుతున్న‌ట్లు స‌మాచారం. ఈ ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ ఈ వారంలోనే రానుంది.
రివాల్వ‌ర్ రీటాకు జేకే చంద్రు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో రాధికా శ‌ర‌త్‌కుమార్‌, సునీల్‌, రెడీన్ కింగ్స్‌లే కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో యాక్ష‌న్ రోల్‌లో కీర్తి సురేష్ మెప్పించింది. కానీ కాన్సెప్ట్‌లో కొత్త‌ద‌నం మిస్స‌వ్వ‌డం, థ్రిల్లింగ్ క‌థ‌ను చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డ‌టంతో రివాల్వ‌ర్ రీటా ప్రేక్ష‌కుల‌ స‌హ‌నానికి ప‌రీక్ష‌గా నిలిచింది. త‌మిళంతో పాటు తెలుగులో బాక్సాఫీస్ వ‌ద్ద ఏ మాత్రం సంద‌డి చేయ‌లేక‌పోయింది. కీర్తి సురేష్ కెరీర్‌లోనే అతి త‌క్కువ క‌లెక్ష‌న్స్‌ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. రివాల్వ‌ర్ రీటా షూటింగ్ చాలా రోజుల క్రిత‌మే పూర్త‌య్యింది. అనివార్య కార‌ణాల వ‌ల్ల రిలీజ్ డిలే కావ‌డం కూడా క‌లెక్ష‌న్స్‌పై ఎఫెక్ట్ చూపించింది.

రివాల్వ‌ర్ రీటా క‌థ ఇదే...

డ్రాకులా పాండ్య‌న్ అనే డాన్ పాండిచ్చేరిని గ‌డ‌గ‌డ‌లాడిస్తుంటాడు. పాండ్య‌న్‌ను చంప‌డానికి న‌ర్సింహారెడ్డి ప్ర‌య‌త్నిస్తుంటాడు. ఓ గ్యాంగ్‌తో డీల్ కుదుర్చుకుంటాడు. అనుకోకుండా రీటా త‌ల్లితో జ‌రిగిన ఓ గొడ‌వ‌లో పాండ్య‌న్ చ‌నిపోతాడు. ఆ మ‌ర్డ‌ర్ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి రీటా ఫ్యామిలీ ఎలాంటి ప్లాన్స్ వేసింది? రీటా కుటుంబాన్ని వెతుక్కుంటూ వ‌చ్చిన బాబీ పాండ్య‌న్‌తో పాటు మార్టిన్ గ్యాంగ్ ఎవ‌ర‌న్న‌దే రివాల్వ‌ర్ రీటా మూవీ క‌థ‌.

రివాల్వ‌ర్ రీటా రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండా ద‌క్షిణాదిలో హీరోయిన్‌గా బిజీగా ఉంది కీర్తి సురేష్‌. ప్ర‌స్తుతం తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ రౌడీ జ‌నార్ధ‌న‌లో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ర‌వి కిర‌ణ్ కోలా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా గ్లింప్స్‌ డిసెంబ‌ర్ 22న విడుద‌ల కాబోతుంది. అలాగే మ‌ల‌యాళం , హిందీ భాష‌ల్లో రెండు సినిమాలు అంగీక‌రించింది కీర్తి సురేష్‌.

Advertisement

తాజావార్తలు

Advertisement