త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Janhvi Kapoor | ఓటీటీలోకి జాన్వీ క‌పూర్ ఎంట్రీ – డెబ్యూ వెబ్‌సిరీస్‌లో కోసం క‌ళ్లు చెదిరే రెమ్యూన‌రేష‌న్ – హీరోల కంటే ఎక్కువే

జాన్వీ క‌పూర్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. త‌మిళంలో కుర‌థి పేరుతో సోషియో థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ చేయ‌బోతుంది. కోలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ పా రంజిత్ నిర్మించ‌నున్న ఈ సిరీస్ కోసం జాన్వీక‌పూర్ డిమాండ్ చేసిన రెమ్యూన‌రేష‌న్ ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్ వ‌ర్గాల్లో షాకింగ్‌గా మారింది.

N

Entertainment | Published On Jun 25, 2026, 4.27 pm IST

Janhvi Kapoor | ఓటీటీలోకి జాన్వీ క‌పూర్ ఎంట్రీ – డెబ్యూ వెబ్‌సిరీస్‌లో కోసం క‌ళ్లు చెదిరే రెమ్యూన‌రేష‌న్ – హీరోల కంటే ఎక్కువే
Advertisement

Janhvi Kapoor |  ఇటీవ‌లే పెద్ది మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది జాన్వీ క‌పూర్‌. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన ఈ సినిమాలో అచ్చియ‌మ్మ అనే మాస్ రోల్‌తో ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేసింది. జాన్వీ డైలాగ్స్‌, ఆమె పాత్ర‌ను డిజైన్ చేసిన తీరుపై ఫ్యాన్స్‌తో పాటు సినీ వ‌ర్గాల నుంచి దారుణంగా విమ‌ర్శ‌లొచ్చాయి. ప్రాముఖ్య‌త‌లేని పాత్ర‌లో అభ్యంత‌ర క‌ర‌రీతిలో ద‌ర్శ‌కుడు జాన్వీని చూపించారంటూ ఫైర్ అయ్యారు. ఈ విమ‌ర్శ‌ల కార‌ణంగా రిలీజ్ త‌ర్వాత పెద్ది ప్ర‌మోష‌న్స్‌కు ఈ బాలీవుడ్ బ్యూటీ దూర‌మైంది.

ఓటీటీలో తొలి అడుగు...

పెద్ది త‌ర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్‌ల‌పై ఫోక‌స్ పెట్టిన జాన్వీ క‌పూర్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే హిందీలో కాకుండా త‌మిళంలో ఈ సిరీస్ చేయ‌బోతున్న‌ద‌ట‌.

పా రంజిత్‌...

కుర‌థి అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ వెబ్‌సిరీస్‌ను త‌మిళ టాప్ డైరెక్ట‌ర్ పా రంజిత్ నిర్మించ‌బోతున్నారు. స‌ర్కున‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు .స‌మాజంలోని అస‌మాన‌త‌ల‌ను చ‌ర్చిస్తూ సోషియో థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ త‌మిళ వెబ్‌సిరీస్‌లో జాన్వీ క‌పూర్ గిరిజ‌న యువ‌తిగా క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. క‌ట్టుబాట్లు, వివ‌క్ష‌ను ఎదుర్కొంటూ జీవితంలో ముందుడుగు వేసే అమ్మాయిగా జాన్వీ పాత్ర రా అండ్ ర‌స్టిక్‌గా ఉంటుంద‌ట‌. ఇప్ప‌టివ‌ర‌కు చేసిన గ్లామ‌ర‌స్ రోల్స్‌కు పూర్తి భిన్నంగా ఇందులో జాన్వీ కొత్త‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

రెమ్యూన‌రేష‌న్‌...

కాగా ఈ త‌మిళ‌ వెబ్‌సిరీస్ కోసం జాన్వీ డిమాండ్ చేసిన రెమ్యూన‌రేష‌న్ ద‌క్షిణాదితో బాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. డెబ్యూ వెబ్‌సిరీస్ కోసం ఇర‌వై కోట్లు రెమ్యూన‌రేష‌న్ తీసుకోబోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు జాన్వీ క‌పూర్ ఐదు నుంచి ఆరు కోట్ల వ‌ర‌కు పారితోషికం తీసుకుంటోంది. కుర‌థి వెబ్‌సిరీస్‌కు మాత్రం మూడింత‌లు ఎక్కువ‌గా రెమ్యూన‌రేష‌న్‌ స్వీక‌రిస్తుండ‌టం హాట్ టాపిక్‌గా మారింది.
జాన్వీ క‌పూర్ డెబ్యూ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ది. త్వ‌ర‌లోనే కుర‌థి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకాబోతున్న‌ట్లు స‌మాచారం.

 

Advertisement
Advertisement