Sabarimala Temple | శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత.. ఫిబ్రవరిలో తెరుచుకోనున్న ద్వారాలు..!
Sabarimala Temple | కేరళలోని శబరిమల ఆలయం మంగళవారం మూతపడింది. ఉదయం 6.45 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధికారులు తెలిపారు. పందలం రాజకుటుంబ ప్రతినిధి పునర్తం నాళ్ నారాయణ వర్మ అయ్యప్పను దర్శించుకున్నాక మూసివేసినట్లు తెలిపారు.
Devotional | Published On Jan 20, 2026, 9.50 pm IST
Sabarimala Temple | కేరళలోని శబరిమల ఆలయం మంగళవారం మూతపడింది. ఉదయం 6.45 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధికారులు తెలిపారు. పందలం రాజకుటుంబ ప్రతినిధి పునర్తం నాళ్ నారాయణ వర్మ అయ్యప్పను దర్శించుకున్నాక మూసివేసినట్లు తెలిపారు. మంగళవారం ఉదయం 5 గంటలకు ఆలయంలో నిత్యక్రతువులు నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం తూర్పు మండపంలో గణపతి హోమం నిర్వహించారు. అనంతరం పవిత్ర త్రివాభరణం తిరుగు ప్రయాణం మొదలైంది. 30 మంది సభ్యులతో కూడిన బృందం, పెరియస్వామి మరుతువన శివంకుట్టి నేతృత్వంలో పవిత్ర ఆభరణాలను అదే మార్గంలో పందలం శ్రీంబిక్కల్ ప్యాలెస్కు తీసుకెళ్లనున్నారు. ఈ బృందం జనవరి 23న పందలం చేరుకుంటుందని దేవస్వం బోర్డు అధికారులు తెలిపారు.
మండల-మకరవిలక్కు సందర్భంగా దాదాపు రెండునెలలకుపైగా ఆలయాన్ని తెరిచారు. చివరి రోజున ప్రధాన పూజారి ఈడీ ప్రసాద్ నంబూద్రి అయ్యప్ప విగ్రహానికి విభూతి అభిషేకం నిర్వహించారు. విగ్రహాన్ని రుద్రాక్ష మాలతో అలంకరించారు. అలాగే, యోగ దండాన్ని స్వామివారి చేతిలో ఉంచారు. చివరగా హరివరాసనం గానం అనంతరం దీపాలను ఆర్పివేసి గర్భాలయ ద్వారాలను మూసివేశారు. సంప్రదాయం మేరకు ఆలయ తాళంచెవిలను పందలం రాజకుటుంబ ప్రతినిధికి అప్పగించారు. ఆయన 18 మెట్లు దిగి, సంప్రదాయ ఆచారాలు పూర్తి చేసి, పరిపాలన అధికారి శ్రీనివాసన్కు అందించారు. ఇదిలా ఉండగా.. ఈ సారి సీజన్లో లక్షలాది మంది భక్తులు శబరిమలకు పోటెత్తారు. ఆలయాన్ని తిరిగి ఫిబ్రవరిలో జరిగే పూజల కోసం తెరువనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కుంభం మాసపు పూజలు ఫిబ్రవరి 12న తేదీ సాయంత్రం 5 గంటలకు 17న రాత్రి 10 గంటలకు ముగుస్తాయి. ఈ రోజుల్లోనే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు అవకాశం ఉంటుందని, దర్శనం టోకెన్లు, ఆన్లైన్ బుకింగ్, భద్రతా ఏర్పాట్లు గతం మాదిరిగానే ఉంటాయని వివరించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






