త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srisailam | శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు షురూ..

Srisailam | ద్వాద‌శ శ‌క్తి పీఠాల‌లో ఒక‌టై శ్రీశైల (Srisailam) మ‌ల్లికార్జున స్వామి వారి ఆల‌యంలో మ‌హాశివ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు (Brahmotsavam) వైభవంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఆదివారం (ఫిబ్ర‌వ‌రి 8) నుంచి ఈ నెల 18వర‌కు కొన‌సాగ‌నున్నాయి.

G

Devotional | Published On Feb 8, 2026, 9.49 am IST

Srisailam | శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు షురూ..
Advertisement

Srisailam | త్రినేత్ర‌.న్యూస్‌: ద్వాద‌శ శ‌క్తి పీఠాల‌లో ఒక‌టై శ్రీశైల (Srisailam) మ‌ల్లికార్జున స్వామి వారి ఆల‌యంలో మ‌హాశివ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు (Brahmotsavam) వైభవంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఆదివారం (ఫిబ్ర‌వ‌రి 8) నుంచి ఈ నెల 18వర‌కు కొన‌సాగ‌నున్నాయి. ఉద‌యం 9 గంట‌ల‌కు స్వామివారి యాగ‌శాల ప్ర‌వేశంతో బ్ర‌హ్మోత్స‌వాల‌కు శ్రీకారం చుట్టారు. ఆదివారం సాయంత్రం బ్ర‌హోత్స‌వాల‌కు స‌క‌ల దేవ‌త‌ల‌కు ఆహ్వానం ప‌లుకుతూ ధ్వ‌జారోహ‌ణ‌, ధ్వ‌జ‌ప‌టం ఆవిష్క‌రించ‌నున్నారు.

బ్ర‌హ్మోత్స‌వాల నేప‌థ్యంలో ఈ నెల 18 వ‌ర‌కు ఆర్జిత‌, ప‌రోక్ష సేవ‌ల‌ను అధికారులు నిలిపివేశారు. వీఐపీలు, సాధార‌ణ భ‌క్తులు అంద‌రికీ స్వామివారి అలంకార ద‌ర్శ‌నంతోపాటు శివ‌స్వాముల‌కు మాత్ర‌మే 12వ తేదీ వ‌ర‌కు నిర్ణీత స‌మ‌యంలో స్ప‌ర్శ ద‌ర్శ‌నానికి అనుమ‌తించ‌నున్నారు. భ‌క్తుల కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. అటవీ మార్గంలో పాదయాత్రగా వచ్చే భక్తులకు భీముని కొలను కైలాసద్వారం నుంచి పలుచోట్ల అన్నదానం, మెడికల్ క్యాంపులు, మంచినీరు, సేద తీరేందుకు షెడ్లు ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement