త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Man Kills Girlfriend | వాలెంటైన్స్ డే నాడు ఘోరం: 15 ఏళ్ల ప్రేమ.. మోసం చేసిందన్న కోపంతో ప్రియురాలిని కాల్చి చంపి ప్రియుడి ఆత్మహత్య

వాలెంటైన్స్ డే రోజున నోయిడాలో విషాదం చోటుచేసుకుంది. 15 ఏళ్లు ప్రేమించుకున్న జంట విగతజీవులుగా మారారు. పెళ్లి విషయంలో మోసం చేసిందన్న కోపంతో ప్రియురాలిని కాల్చి చంపి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

J

Crime | Published On Feb 14, 2026, 10.30 pm IST

Man Kills Girlfriend | వాలెంటైన్స్ డే నాడు ఘోరం: 15 ఏళ్ల ప్రేమ.. మోసం చేసిందన్న కోపంతో ప్రియురాలిని కాల్చి చంపి ప్రియుడి ఆత్మహత్య
Advertisement

Man Kills Girlfriend | త్రినేత్ర.న్యూస్ : ప్రేమికుల రోజు (Valentine's Day) నాడు నోయిడాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, చివరి నిమిషంలో మరొకరిని పెళ్లి చేసుకునేందుకు ప్రియురాలు సిద్ధమైందన్న ఆక్రోశంతో ఓ యువకుడు ఘాతుకానికి ఒడిగట్టాడు. కారులోనే ప్రియురాలిని తుపాకీతో కాల్చి చంపి, అనంతరం తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

సెక్టార్ 107లో కలకలం

నోయిడాలోని సెక్టార్ 107, దాద్రీ రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz) కారులో శనివారం ఉదయం రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా.. కారు లోపలి నుంచి లాక్ చేసి ఉంది. అద్దాలు పగులగొట్టి చూడగా యువతీయువకులు రక్తపు మడుగులో పడి ఉన్నారు. మృతులను ఢిల్లీలోని త్రిలోక్‌పురి నివాసి సుమిత్ (32), నోయిడా సెక్టార్ 101 నివాసి రేఖ (26)గా గుర్తించారు.

15 ఏళ్ల ప్రేమ.. చివరికి ఇలా..

పోలీసుల ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుమిత్, రేఖ గత 15 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే, ఇటీవల రేఖకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. ఆమె దానికి అంగీకరించడంతో సుమిత్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తనను 15 ఏళ్లు ప్రేమించి, ఇప్పుడు మోసం చేస్తోందని రగిలిపోయాడు.

చనిపోయే ముందు మెసేజ్

ఈ ఘాతుకానికి పాల్పడే ముందు సుమిత్ తన సోదరుడికి ఓ సందేశాన్ని పంపినట్లు పోలీసులు గుర్తించారు. "నేను చనిపోతున్నాను. నా చావుకు రేఖే కారణం. 15 ఏళ్లుగా నాతో ఉండి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి.. ఇప్పుడు వేరే వాళ్లను పెళ్లి చేసుకుంటోంది. నన్ను మోసం చేసింది." అని ఆ మెసేజ్‌లో పేర్కొన్నాడు.

శుక్రవారం నుంచే వీరిద్దరూ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరికి ప్రేమికుల రోజు నాడే ఇద్దరూ విగతజీవులుగా మారడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఘటనా స్థలంలో తుపాకీని స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement