త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | ట్రంప్ ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లు క్రాష్.. ఒక్క రోజులోనే 8 లక్షల కోట్లు లాస్

అమెరికా విధించబోయే కొత్త టారిఫ్‌ల గురించి ఉన్న ఆందోళనలే దేశీయ మార్కెట్లను ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. అలాగే విదేవీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) వరుసగా నాలుగో రోజు అమ్మకాలు చేపట్టారు.

J

Business | Published On Jan 8, 2026, 3.57 pm IST

Stock Markets | ట్రంప్ ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లు క్రాష్.. ఒక్క రోజులోనే 8 లక్షల కోట్లు లాస్
Advertisement

Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు గురువారం క్రాష్ అయ్యాయి. భారీ నష్టాలను చవి చూశాయి. ఇది భారీ క్రాష్ కాకపోయినా నిఫ్టీ 50 ఇండెక్స్ 1 శాతానికి పైగా నష్టంతో ముగిసింది. 263.90 పాట్లు నష్టపోయి 25,876 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 0.92 శాతం పడిపోయి 780.18 పాయింట్ల నష్టంతో 84,180.96 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 304.35 పాయింట్లు నష్టపోయింది. 0.51 శాతం పడి 59,686.50 వద్ద ముగిసింది.

అమెరికా టారిఫ్‌ల భయమేనా?

అమెరికా విధించబోయే కొత్త టారిఫ్‌ల గురించి ఉన్న ఆందోళనలే దేశీయ మార్కెట్లను ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. అలాగే విదేవీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) వరుసగా నాలుగో రోజు అమ్మకాలు చేపట్టారు. మరోవైపు డాలర్ మారకంతో రూపాయి విలువ కూడా పడిపోవడంపై మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ఈక్విటీ స్టాక్స్‌లో స్వల్పకాల ఒత్తిడి ఉందని.. దీర్ఘకాలంలో వృద్ధి ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు భారీగా నష్టపోయాయి. అమెరికాకు ఎగుమతులు చేసే టెక్స్‌టైల్స్, ఫార్మా, ఐటీ కంపెనీల షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి.

8 లక్షల కోట్ల సంపద ఆవిరి

ఒక్క రోజులోనే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ భారీగా పడిపోవడంతో మదుపర్ల సంపద రూ.8 లక్షల కోట్లు ఆవిరైంది. బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం విలువ రూ.480 లక్షల కోట్లు కాగా, గురువారం నష్టం రూ.8 లక్షల కోట్లు పోగా రూ.472 కోట్లకు చేరుకోవడం గమనార్హం.

Advertisement

తాజావార్తలు

Advertisement