Stocks | పెట్టుబడిదారులకు కాసుల వర్షం కురిపించిన పెన్నీ స్టాక్స్.. వేలు పెట్టి ఉంటే ఇప్పుడు కోట్లు వచ్చి ఉండేవి..
Stocks | స్టాక్ మార్కెట్లో పెన్నీ స్టాక్స్ అంటే సాధారణంగా ఎక్కువ రిస్క్, తక్కువ లిక్విడిటీ, భారీ వోలాటిలిటీ, స్పెక్యులేటివ్ ట్రేడింగ్కు ప్రతీకగా భావిస్తారు. అయితే గత ఐదేళ్లలో కొన్ని చిన్న మైక్రోక్యాప్ కంపెనీలు పెట్టుబడిదారులకు ఊహించని స్థాయిలో సంపద సృష్టించాయి.
Stocks | స్టాక్ మార్కెట్లో పెన్నీ స్టాక్స్ అంటే సాధారణంగా ఎక్కువ రిస్క్, తక్కువ లిక్విడిటీ, భారీ వోలాటిలిటీ, స్పెక్యులేటివ్ ట్రేడింగ్కు ప్రతీకగా భావిస్తారు. అయితే గత ఐదేళ్లలో కొన్ని చిన్న మైక్రోక్యాప్ కంపెనీలు పెట్టుబడిదారులకు ఊహించని స్థాయిలో సంపద సృష్టించాయి. ముఖ్యంగా డిఫెన్స్, రిన్యూవబుల్ ఎనర్జీ, రైల్వేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల బూమ్ కారణంగా 2021 మేలో రూ.20 కన్నా తక్కువ ధరలో ట్రేడ్ అయిన కొన్ని షేర్లు ఇప్పుడు రూ.3వేల కోట్ల నుంచి రూ.12వేల కోట్ల మార్కెట్ క్యాప్ కలిగిన దిగ్గజాలుగా మారాయి.
డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
ఈ కంపెనీ గత ఐదేళ్లలో మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ జాబితాలో నిలిచింది. పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పెరుగుతున్న పెట్టుబడులు కంపెనీ గ్రోత్కు బలమయ్యాయి. 2021లో ఈ కంపెనీ షేర్ ధర రూ.0.07 మాత్రమే.5 ఏళ్ల తరువాత అది రూ.167 అయింది. అంటే 2,39,000 శాతం లాభాలను అందించిందన్నమాట. అప్పట్లో రూ.18.9 కోట్లుగా ఉన్న కంపెనీ మార్కెట్ క్యాపిటల్ ప్రస్తుతం రూ.8,819 కోట్లకు చేరింది. పెట్టుబడిదారులకు ఈ పెన్నీ స్టాక్ భారీ లాభాలను అందించింది.
వారీ రిన్యూవబుల్ టెక్నాలజీస్
ఈ కంపెనీ కూడా రిన్యూవబుల్ ఎనర్జీ రంగ బూమ్ను పూర్తిగా ఉపయోగించుకుంది. సౌర విద్యుత్ ప్రాజెక్టుల విస్తరణతో కంపెనీ షేర్ భారీగా పెరిగింది. 2021లో ఈ కంపెనీ షేర్ ధర రూ.13.93 ఉండగా, ఇప్పుడు రూ.1వేయికి పైనే ట్రేడ్ అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కంపెనీ 70 సార్లకు పైగా భారీ రాబడులను అందించింది. రూ.145 కోట్లుగా ఉన్న కంపెనీ విలువ రూ.10,600 కోట్లకు చేరింది.
కేపీఐ గ్రీన్ ఎనర్జీ
కేపీఐ గ్రీన్ ఎనర్జీ షేర్లు ఐదేళ్లలో రూ.6.72 నుంచి రూ.455.85 వరకు ఎగబాకాయి. అంటే దాదాపు 6,700 శాతం లాభాలు ఇచ్చాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.109 కోట్ల నుంచి సుమారు రూ.9వేల కోట్లకు చేరింది. రిన్యూవబుల్ ఎనర్జీ డెవలపర్లపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరగడం దీనికి ప్రధాన కారణంగా నిలిచింది.
అపోలో మైక్రో సిస్టమ్స్
డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రంగానికి చెందిన ఈ షేర్ 2021లో రూ.10.68 వద్ద ఉండగా, 2026 నాటికి రూ.308.30 కి చేరింది. అంటే దాదాపు 29 రెట్లు రాబడులు ఇచ్చింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.222 కోట్ల నుంచి రూ.11వేల కోట్లకు పైగా పెరిగింది. దేశీయ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పెరగడం దీనికి మద్దతు ఇచ్చింది.
జూపిటర్ వ్యాగన్స్
ఈ కంపెనీ కూడా రైల్వే, ఫ్రైట్ రంగాల విస్తరణతో భారీ వృద్ధిని నమోదు చేసింది. రూ.16.65 గా ఉన్న షేర్ ప్రస్తుతం రూ.296.70గా మారింది. ఇందుకు 5 ఏళ్లే పట్టింది. ఈ సమయంలో 18 సార్లు రాబడులను ఇచ్చింది. రూ.149 కోట్ల విలువ ఇప్పుడు రూ.12,680 కోట్లకు చేరింది.

అవాంటెల్
డిఫెన్స్ కమ్యూనికేషన్ కంపెనీ అవాంటెల్ 2021 మేలో రూ.6.67 వద్ద ట్రేడ్ కాగా, ప్రస్తుతం సుమారు రూ.151.35 వద్ద ఉంది. ఈ షేర్ పెట్టుబడిదారులకు 22 రెట్లకు పైగా రాబడులు అందించింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.171 కోట్ల నుంచి రూ.4వేల కోట్లకు పైగా పెరిగింది.
ఏజీఐ ఇన్ఫ్రా
పంజాబ్కు చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్ ఏజీఐ ఇన్ఫ్రా షేర్ రూ.7.16 నుంచి రూ.367.10 వరకు పెరిగింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.87 కోట్ల నుంచి రూ.4,589 కోట్లకు చేరింది. హౌసింగ్ డిమాండ్, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ బలపడటం దీనికి సహాయపడ్డాయి.
ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ ఇండియా
పవర్ ఎక్విప్మెంట్ తయారీ సంస్థ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ ఇండియా షేర్ ఐదేళ్లలో రూ.10.48 నుంచి రూ.322.45 వరకు ఎగిసింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.278 కోట్ల నుంచి రూ.9,679 కోట్లకు పెరిగింది. ట్రాన్స్మిషన్ క్యాపెక్స్, గ్రిడ్ విస్తరణ కంపెనీ వృద్ధికి దోహదపడ్డాయి.
లాయిడ్స్ ఇంజినీరింగ్ వర్క్స్
లాయిడ్స్ ఇంజినీరింగ్ వర్క్స్ షేర్ 2021 మేలో కేవలం రూ.1.45 వద్ద ట్రేడ్ అయింది. ప్రస్తుతం ఈ షేర్ ధర రూ.59.66 వద్ద ఉంది. అంటే 40 రెట్లకు పైగా రాబడులు ఇచ్చింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.154 కోట్ల నుంచి రూ.8,830 కోట్లకు పెరిగింది.
నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజినీరింగ్
మెరైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి చెందిన ఈ కంపెనీ షేర్ ఐదేళ్లలో రూ.18.50 నుంచి రూ.2,206.85 వరకు దూసుకెళ్లింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.38 కోట్ల నుంచి రూ.5,394 కోట్లకు పెరిగింది. పోర్ట్, డ్రెడ్జింగ్ కాంట్రాక్టుల్లో బలమైన ఎగ్జిక్యూషన్ దీనికి ప్రధాన బలం అయింది.
ఆయా స్టాక్స్లో చాలా స్వల్ప మొత్తంలో 5 ఏళ్ల క్రితం పెట్టుబడి పెట్టి ఉన్నా ఇప్పుడు భారీ ఎత్తున రాబడులు వచ్చి ఉండేవి. అంటే డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్ను ఉదాహరణగా తీసుకుంటే ఈ కంపెనీలో 0.07 ధరకు 1 లక్ష షేర్లను అప్పట్లో కొని ఉంటే పెట్టుబడి కేవలం రూ.7వేలు అయ్యేది. ఇక ఇప్పుడు లాభాలు రూ.1.67 కోట్లు వచ్చి ఉండేవి. ఇలా పలు పెన్నీ స్టాక్స్ భారీ ఎత్తున రాబడులను ఇస్తుంటాయి. అయితే స్టాక్స్లో పెట్టుబడులు పెట్టేముందు తప్పనిసరిగా ఆర్థిక నిపుణుల సూచనలు పాటించాల్సి ఉంటుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



