త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trains | రైళ్ల‌లో ఈ వస్తువుల‌ను తీసుకెళ్తే రూ.10వేల జరిమానా

Trains | ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి భారతీయ రైల్వేలు జన విశ్వాస్ (అమెండ్‌మెంట్ ఆఫ్ ప్రొవిజన్స్) యాక్ట్-2026 కింద కఠినమైన జరిమానా నిబంధనలను అమల్లోకి తెచ్చాయి. ఇటీవ‌లే అమల్లోకి వచ్చిన ఈ సవరణల ప్రకారం రైళ్లలో నిషేధిత లేదా ప్రమాదకర వస్తువులను తీసుకెళ్లే ప్రయాణికులపై భారీ జరిమానాలు విధించనున్నారు.

S

Business | Published On Jun 23, 2026, 3.38 pm IST

Trains | రైళ్ల‌లో ఈ వస్తువుల‌ను తీసుకెళ్తే రూ.10వేల జరిమానా
Advertisement

Trains | ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి భారతీయ రైల్వేలు జన విశ్వాస్ (అమెండ్‌మెంట్ ఆఫ్ ప్రొవిజన్స్) యాక్ట్-2026 కింద కఠినమైన జరిమానా నిబంధనలను అమల్లోకి తెచ్చాయి. ఇటీవ‌లే అమల్లోకి వచ్చిన ఈ సవరణల ప్రకారం రైళ్లలో నిషేధిత లేదా ప్రమాదకర వస్తువులను తీసుకెళ్లే ప్రయాణికులపై భారీ జరిమానాలు విధించనున్నారు. సవరించిన రైల్వే చట్టంలోని సెక్షన్ 165 ప్రకారం ప్రమాదకర లేదా ఇతరులకు హాని కలిగించే వస్తువులను తీసుకెళ్తూ పట్టుబడిన ప్రయాణికులకు కనీసం రూ.10వేల జరిమానా విధిస్తారు. ప్రయాణికుల ప్రాణాలకు, రైల్వే ఆస్తులకు ముప్పు కలిగించే వస్తువుల రవాణాను అరికట్టడమే ఈ నిర్ణయం లక్ష్యంగా రైల్వే అధికారులు చెబుతున్నారు.

నిషేధిత వ‌స్తువులు ఇవే..

నిషేధిత వస్తువుల జాబితాలో పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాస్ సిలిండర్లు, స్టవ్‌లు, బాణాసంచా, పేలుడు పదార్థాలు, ఆమ్లాలు, తినే రసాయనాలు, అగ్గిపెట్టెలు, సిగరెట్లు, మంటలు లేదా ప్రమాదాలకు కారణమయ్యే ఇతర పదార్థాలు ఉన్నాయి. ఇలాంటి వస్తువులను రైళ్లలో తీసుకెళ్లడం చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. జరిమానాతో పాటు ఈ వస్తువుల కారణంగా ఎవరికైనా గాయాలు, ఆస్తి నష్టం లేదా ఇతర హాని జరిగితే, వాటికి సంబంధించి పూర్తి బాధ్యత కూడా నిందితులపైనే ఉంటుంది. అలాగే రైల్వే అధికారులు ఆ నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకునే అధికారం కలిగి ఉంటారు. ఒకవేళ ప్రయాణికులు ఆ వస్తువులను తొలగించేందుకు లేదా విధించిన జరిమానాను చెల్లించేందుకు నిరాకరిస్తే, వారికి గరిష్టంగా ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తారు. అలాగే కోర్టు కనీసం రూ.10వేల జరిమానా విధించే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష, జరిమానా రెండూ కలిపి విధిస్తారు.

ఇత‌ర శిక్ష‌లు సైతం పెంపు..

ఈ చట్ట సవరణలతో పాటు ఇతర రైల్వే నేరాలకు సంబంధించిన శిక్షలను కూడా ప్రభుత్వం పెంచింది. టికెట్ లేకుండా లేదా మోసపూరితంగా ప్రయాణిస్తే, చెల్లించాల్సిన ప్రయాణ చార్జీకి అదనంగా కనీసం రూ.500 జరిమానా విధిస్తారు. ఇతరుల టికెట్‌పై ప్రయాణించినా ఇదే స్థాయి జరిమానాతోపాటు టికెట్‌ను స్వాధీనం చేసుకుంటారు. మహిళలకు కేటాయించిన బోగీల్లో ప్రయాణించే పురుషులకు రూ.2,500 జరిమానా విధించడంతోపాటు ఆ కంపార్ట్‌మెంట్ నుంచి బయటకు పంపిస్తారు. రైళ్లలో లేదా రైల్వే ప్రాంగణంలో ధూమపానం చేయడం, అనుమతి లేకుండా వ్యాపారం చేయడం లేదా భిక్షాటన చేయడం వంటి చర్యలకు రూ.2వేల జరిమానా విధిస్తారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రవర్తన, బహిరంగ మద్యం మత్తు, అసభ్య ప్రవర్తన, దుర్భాషలాడటం, ప్రజా నోటీసులను ధ్వంసం చేయడం వంటి చర్యలపైనా కఠినమైన జరిమానాలు అమలు చేయనున్నట్లు రైల్వేలు స్పష్టం చేశాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement