త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Market Crash | స్టాక్ మార్కెట్లకు భారీ షాక్.. 5 రోజుల లాభాలకు బ్రేక్.. సెన్సెక్స్ 931, నిఫ్టీ 222 పాయింట్లు పతనం

వరుసగా ఐదు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలను చవిచూశాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, పెరుగుతున్న క్రూడాయిల్ ధరలతో సెన్సెక్స్ ఏకంగా 931 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ 23,800 దిగువకు పడిపోయింది.

J

Business | Published On Apr 9, 2026, 5.30 pm IST

Stock Market Crash | స్టాక్ మార్కెట్లకు భారీ షాక్.. 5 రోజుల లాభాలకు బ్రేక్.. సెన్సెక్స్ 931, నిఫ్టీ 222 పాయింట్లు పతనం
Advertisement

Stock Market Crash | త్రినేత్ర.న్యూస్ : దేశీయ ఈక్విటీ మార్కెట్ల వరుస లాభాల జోరుకు బ్రేక్ పడింది. గత ఐదు రోజులుగా లాభాల బాటలో పయనించిన సూచీలు గురువారం కుప్పకూలాయి. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురవుతోందన్న ఆందోళనలు, ముడి చమురు ధరల పెరుగుదల మార్కెట్లపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి.

మార్కెట్ ముగింపు ఇలా

ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 931.25 పాయింట్లు (1.20 శాతం) మేర భారీగా క్షీణించి 76,631.65 వద్ద స్థిరపడింది. అటు జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 222.25 పాయింట్లు (0.93 శాతం) పతనమై 23,775.10 వద్ద ముగిసింది.

మార్కెట్ల పతనానికి కారణాలివే

అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ మొదలైన ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి వద్ద కొనసాగుతున్న ఆంక్షల కారణంగా క్రూడాయిల్ ధరలు పెరిగాయి. దీంతో కాల్పుల విరమణ వల్ల వచ్చిన సానుకూలత ఆవిరైంది. ఇది భారతదేశంలో మళ్లీ ద్రవ్యోల్బణం భయాలను రేకెత్తించింది. దేశీయంగా చూస్తే.. ప్రాఫిట్ బుకింగ్ (లాభాల స్వీకరణ), 10-ఏళ్ల బాండ్ ఈల్డ్స్ పెరగడం, రూపాయి విలువ క్షీణించడం వంటి పరిణామాలు పెట్టుబడిదారుల రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని తగ్గించాయి. గత సెషన్‌లో భారీగా లాభపడిన ఫైనాన్షియల్ షేర్లు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నిరంతర అమ్మకాల కారణంగా మార్కెట్లు పతనమయ్యాయి.

నష్టపోయిన, లాభపడిన షేర్లు

సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (IndiGo) అత్యధికంగా నష్టపోయింది. ఈ షేరు ఏకంగా 3.63 శాతం పతనమై రూ.4,449కి పడిపోయింది. ఆ తర్వాతి స్థానాల్లో ఎల్ అండ్ టీ -2.88%, ఎటర్నల్ -2.57%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ -2.13%, కోటక్ మహీంద్రా బ్యాంక్ -2.13%, ఐసీఐసీఐ బ్యాంక్ -1.97% ఉన్నాయి. భారీ నష్టాల మధ్య కూడా భారత్ ఎలక్ట్రానిక్స్, ఎన్‌టీపీసీ, టీసీఎస్ షేర్లు స్వల్పంగా (1.39 శాతం వరకు) లాభపడి సానుకూలతను కనబరిచాయి.

సెన్సెక్స్‌ను ముంచిన ఐదు షేర్లు

ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ షేర్ల పతనం సెన్సెక్స్ భారీ నష్టాలకు ప్రధాన కారణంగా నిలిచాయి. సెక్టార్ ఇండీసెస్ పరంగా చూస్తే, బ్యాంకింగ్ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. బీఎస్‌ఈ బ్యాంకెక్స్ 1.58 శాతం క్షీణించి 61,710.92 వద్ద స్థిరపడగా, బీఎస్‌ఈ ఆటో ఇండెక్స్ 0.37 శాతం పతనమై 57,143.76 వద్ద ముగిసింది.

Advertisement
Advertisement