SBI Shares | భారీగా ఎగబాకిన ఎస్బీఐ షేర్లు.. క్యూ3 ఫలితాలతో 7 శాతం పెరుగుదల..
SBI Shares | దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) షేర్లు ఫిబ్రవరి 9న సోమవారం మార్కెట్ సెషన్లో దాదాపు 7 శాతం పెరిగి ఆల్టైమ్ హై స్థాయికి చేరాయి. క్యూ3 ఫలితాలు మార్కెట్ అంచనాలను మించి రావడంతో పెట్టుబడిదారుల ఆసక్తి ఒక్కసారిగా పెరిగింది.
SBI Shares | దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) షేర్లు ఫిబ్రవరి 9న సోమవారం మార్కెట్ సెషన్లో దాదాపు 7 శాతం పెరిగి ఆల్టైమ్ హై స్థాయికి చేరాయి. క్యూ3 ఫలితాలు మార్కెట్ అంచనాలను మించి రావడంతో పెట్టుబడిదారుల ఆసక్తి ఒక్కసారిగా పెరిగింది. పలు బ్రోకరేజ్ సంస్థలు షేర్ టార్గెట్ ధరలను పెంచాయి. సోమవారం ఉదయం ట్రేడింగ్లో ఎస్బీఐ షేర్ ధర రూ.1,137కు చేరి కొత్త 52 వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఫిబ్రవరి 7న ఎస్బీఐ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం (క్యూ3, ఆర్థిక సంవత్సరం 2025-26) ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో బ్యాంకు మైనారిటీ వాటా అనంతరం రూ.21,028.15 కోట్ల నికర లాభం నమోదు చేసినట్లు తేలింది. ఇది ఎస్బీఐ చరిత్రలోనే అత్యధిక త్రైమాసిక లాభం కావడం విశేషం.
తగ్గిన ఎన్పీఏ నిష్పత్తి..
గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.16,891.44 కోట్లతో పోలిస్తే ఇది 24.49 శాతం వార్షిక వృద్ధి (YoY) కాగా కోర్ లెండింగ్ ఆదాయాన్ని సూచించే నికర వడ్డీ ఆదాయం (NII) సైతం 9 శాతం పెరిగి రూ.45,190 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ.41,445 కోట్లుగా నమోదైంది. ఇక ఆస్తుల నాణ్యతలో కూడా స్పష్టమైన మెరుగుదల కనిపించింది. గ్రాస్ ఎన్పీఏ నిష్పత్తి క్యూ2లోని 1.73 శాతం నుంచి క్యూ3లో 1.57 శాతానికి తగ్గగా, నెట్ ఎన్పీఏ నిష్పత్తి 0.42 శాతం నుంచి 0.39 శాతానికి తగ్గింది. ఈ త్రైమాసికంలో ప్రొవిజన్లు రూ.4,506 కోట్లుగా నమోదయ్యాయి. ఇది గత త్రైమాసికంలోని రూ.5,400 కోట్లతో పోలిస్తే తక్కువగా ఉండటంతోపాటు ఏడాది క్రితం నమోదైన స్థాయిలతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. దీన్ని క్రెడిట్ ఖర్చులు తగ్గుతున్నాయనే సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
భారీ టార్గెట్ను నిర్దేశించిన అనలిస్టులు..
అదే సమయంలో ఎస్బీఐ మేనేజ్మెంట్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి రుణ వృద్ధి అంచనాలను 13-15 శాతానికి పెంచింది. గతంలో ఈ అంచనాలు 12-14 శాతంగా ఉండేవి. ఈ క్రమంలోనే గణనీయమైన లాభాలు, మెరుగైన ఆస్తుల నాణ్యత, భవిష్యత్ వృద్ధిపై ఆశావహ అంచనాలు కలిసి ఎస్బీఐ షేర్లకు బలాన్నిస్తున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఎస్బీఐ షేర్లను కొనుగోలు చేయాలని పలు బ్రోకరేజ్ సంస్థలు, అనలిస్టులు సైతం రికమెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నోమురా అనే సంస్థ ఎస్బీఐ షేర్లను ప్రస్తుతం కొని రూ.1235 వద్ద అమ్మాలని టార్గెట్ నిర్ణయించగా, సీఎల్ఎస్ఏ మాత్రం షేర్ ధర టార్గెట్ను రూ.1275గా నిర్ణయించింది. అలాగే మరో సంస్థ సిటి ఎస్బీఐ షేర్లను కొని రూ.1265 వద్ద విక్రయించాలని సూచించింది. ఇక జెఫ్రీస్, నువామా అనే అనలిస్ట్ సంస్థలు ఎస్బీఐ షేర్లను రూ.1300, రూ.1250 వద్ద అమ్మాలని చెప్పాయి. కాగా మంగళవారం (ఫిబ్రవరి 10, 2026) నాటి మార్కెట్ సెషన్లో ఎస్బీఐ షేర్ ధర రూ.1140 వద్ద కొనసాగుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



