త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rs 2K Notes | రూ.2వేల నోట్ల‌పై రిజ‌ర్వ్ బ్యాంక్ కీల‌క ప్ర‌క‌ట‌న‌..!

Rs 2K Notes | రూ.2వేల నోట్ల‌పై రిజ‌ర్వ్ బ్యాంక్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సెంట్ర‌ల్ బ్యాంక్ విడుద‌ల చేసిన నోట్ల‌లో 98.47 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లోకి వ‌చ్చాయ‌ని వెల్ల‌డించింది.

P

Business | Published On May 2, 2026, 5.20 pm IST

Rs 2K Notes | రూ.2వేల నోట్ల‌పై రిజ‌ర్వ్ బ్యాంక్ కీల‌క ప్ర‌క‌ట‌న‌..!
Advertisement

Rs 2K Notes | రూ.2వేల నోట్ల‌పై రిజ‌ర్వ్ బ్యాంక్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సెంట్ర‌ల్ బ్యాంక్ విడుద‌ల చేసిన నోట్ల‌లో 98.47 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లోకి వ‌చ్చాయ‌ని వెల్ల‌డించింది. దాదాపు మూడేళ్ల కింద‌ట కేంద్ర ప్ర‌భుత్వం రూ.2వేల నోట్ల‌ను ఉప సంహ‌రించుకుంటున్న‌ట్లుగా ప్ర‌క‌టించింది. నోట్లు చ‌లామ‌ణిలో ఉన్న స‌మ‌యంలో ఉన్న నోట్ల విలువ రూ.3.56ల‌క్ష‌ల కోట్లు. ఏప్రిల్ 30 నాటికి ఈ విలువ గ‌ణ‌నీయంగా త‌గ్గి రూ.5,451 కోట్ల‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఆర్‌బీఐకి చెందిన 19 కార్యాల‌యాల్లో రూ.2వేల నోట్ల‌ను మార్చుకునేందుకు అవ‌కాశం ఇస్తోంది. అయితే, నోట్ల‌ను చ‌లామ‌ణి నుంచి వెన‌క్కి తీసుకున్నా ఇప్ప‌టికీ చ‌ట్ట‌బ‌ద్ధమైన క‌రెన్సీగానే కొన‌సాగుతోంద‌ని ఆర్‌బీఐ స్ప‌ష్టం చేసింది.

Advertisement
Advertisement