త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RBI | రూ.2 వేల నోట్లపై ఆర్‌బీఐ కీల‌క ప్ర‌క‌ట‌న‌

RBI | రూ.2వేలనోట్ల (Rs 2,000 Notes)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

D

Business | Published On Feb 3, 2026, 11.20 am IST

RBI | రూ.2 వేల నోట్లపై ఆర్‌బీఐ కీల‌క ప్ర‌క‌ట‌న‌
Advertisement

RBI | రూ.2వేలనోట్ల (Rs 2,000 Notes)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కూ చలామణి నుంచి దాదాపు 98.42 శాతం నోట్లు తిరిగి బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వచ్చాయని తెలిపింది. ఈ మేర‌కు నిన్న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇంకా రూ. 5,609 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని, అవి రావాల్సి ఉందని స్పష్టం చేసింది.

2023 మే 19న చలామణి నుంచి రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు (Denomination Banknotes) ఆర్‌బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. నాడు చలామణిలో ఉన్న ఈ నోట్ల విలువ రూ.3.56 లక్షల కోట్లు. ఇదిలావుంటే 2023 అక్టోబర్‌ దాకా దేశంలోని అన్ని బ్యాంక్‌ శాఖల్లో రూ.2,000 నోట్ల మార్పిడి జరిగింది. ఆ తర్వాత నుంచి హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో మాత్రమే ఈ మార్పిడికి వీలుంది.

అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలోని ఆర్బీఐ శాఖల్లో రూ.2వేల నోట్లు మార్చుకోవచ్చు. కాగా, కేంద్ర ప్రభుత్వం నవంబర్ 2016లో రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అప్పుడు చలమాణిలో ఉన్న రూ. 1,000, రూ.500 నోట్లను రద్దు చేసి రూ.2వేల నోట్లను చలామణిలోకి తెచ్చింది.

Advertisement
Advertisement