RBI | ఆర్బీఐ మానెటరీ పాలసీ కమిటీ సమావేశం.. ఏప్రిల్ 8న పాలసీ ప్రకటన..
RBI | భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మానెటరీ పాలసీ కమిటీ (MPC) వడ్డీ రేట్లను, ద్రవ్యోల్బణ పరిస్థితులను సమీక్షించేందుకు సోమవారం సమావేశమైంది. ఏప్రిల్ సమీక్షలో వడ్డీ రేట్లను 5.25 శాతం వద్ద MPC యథాతథంగా ఉంచుతుందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
RBI | భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మానెటరీ పాలసీ కమిటీ (MPC) వడ్డీ రేట్లను, ద్రవ్యోల్బణ పరిస్థితులను సమీక్షించేందుకు సోమవారం సమావేశమైంది. ఏప్రిల్ సమీక్షలో వడ్డీ రేట్లను 5.25 శాతం వద్ద MPC యథాతథంగా ఉంచుతుందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే అమెరికా-ఇరాన్ యుద్ధంపై ఆర్బీఐ చేసే వ్యాఖ్యల కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 6 నుంచి 8 వరకు జరగనున్న ఈ MPC సమావేశంలో ఆర్థిక పరిస్థితులు, ధరల స్థిరత్వాన్ని పరిశీలిస్తూ, యుద్ధం వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణ ప్రభావాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.
ఇంధన మార్కెట్లపై యుద్ధం ప్రభావం..
మధ్యప్రాచ్య యుద్ధం ప్రపంచ ఇంధన మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేసింది. బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్కు 100 డాలర్లకు పైగా కొనసాగుతున్నాయి. ముఖ్యమైన హార్ముజ్ జలసంధి నిరవధికంగా మూసివేయబడే పరిస్థితులు ఏర్పడటంతో, భారతదేశ ఇంధన దిగుమతులపై కూడా ప్రభావం పడింది. దీనివల్ల రూపాయి విలువ గణనీయంగా పడిపోయి, FY26లో దశాబ్దంలోనే అత్యంత బలహీన ప్రదర్శన చూపింది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రూపాయి విలువ 4 శాతం కన్నా ఎక్కువగా తగ్గింది. క్రూడ్ ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే రూపాయిపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. రూపాయికి తాత్కాలిక ఉపశమనం కలిగించేందుకు RBI కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, భవిష్యత్లో రూపాయి మార్గం, వడ్డీ రేట్లపై నిర్ణయం ప్రపంచ స్థాయి ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
వడ్డీ రేట్లను కొనసాగిస్తుందా..
ఇటీవల ఆస్ట్రేలియా, జపాన్ కేంద్ర బ్యాంకులు కూడా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు వడ్డీ రేట్లు పెంచాయి. కొలంబియా, బ్రెజిల్ దేశాలు కూడా ఇదే దారిలో నడిచాయి. కాగా, RBI ఫిబ్రవరి 2025 నుంచి మొత్తం 125 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గించింది. చివరి సారి డిసెంబర్లో రేటు కోత ప్రకటించగా, అనంతరం కొంత విరామం ఉండొచ్చని నిపుణులు భావించారు. జనవరిలో వచ్చిన రాయిటర్స్ నివేదిక ప్రకారం 2026 వరకు కీలక వడ్డీ రేటును 5.25 శాతం వద్ద స్థిరంగా ఉంచుతూ, గతంలో చేసిన రేటు కోతల ప్రభావాన్ని పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రపంచ పరిస్థితుల్లో జరిగిన తీవ్ర మార్పుల నేపథ్యంలో భవిష్యత్ MPC సమావేశాల్లో RBI జాగ్రత్త దృక్పథాన్ని అవలంబించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయినప్పటికీ సమీప కాలంలో ప్రస్తుత వడ్డీ రేట్లను కొనసాగించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.
మూడు రోజుల సమావేశం అనంతరం అధికారిక MPC ప్రకటన ఏప్రిల్ 8న విడుదల కానుంది. ఈ ప్రకటనను RBI సోషల్ మీడియా వేదికలపై ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చు. ప్రకటన అనంతరం గవర్నర్ సంజయ్ మల్హోత్రా మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. దీంతో ఆర్బీఐ పాలసీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






