RBI | బ్యాంకుల్లో తగ్గుతున్న డిపాజిట్లు.. ఆర్బీఐ అత్యవసర సమావేశాలు..
RBI | దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్ల వృద్ధి మందగించిన నేపథ్యంలో, వాణిజ్య బ్యాంకులు పెద్ద మొత్తంలో, స్థిరమైన డిపాజిట్లను ఆకర్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులతో చర్చలు ప్రారంభించింది.
RBI | దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్ల వృద్ధి మందగించిన నేపథ్యంలో, వాణిజ్య బ్యాంకులు పెద్ద మొత్తంలో, స్థిరమైన డిపాజిట్లను ఆకర్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులతో చర్చలు ప్రారంభించింది. ప్రజలు ఈక్విటీలు, మ్యుచువల్ ఫండ్లు వంటి ఇతర పెట్టుబడి మార్గాల వైపు మళ్లుతున్న నేపథ్యంలో, ఇది బ్యాంకులకు భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్ని వారాలుగా బ్యాంకులతో జరిగిన సమావేశాల్లో ఆర్బీఐ అధికారులు ఇవే విషయాలపై చర్చిస్తున్నారు. బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గుతుండగా, ఫైనాన్షియల్ మార్కెట్లలో ఎక్కువ మంది ప్రజలు పాల్గొనడంపై వారు చర్చలు జరిపారు. ఈ మార్కెట్లలో వారు పాల్గొనడం వల్ల బ్యాంకింగ్ డిపాజిట్ల స్వరూపం ఎలా మారిందనే అంశంపై వారు చర్చించారు. అయితే ప్రస్తుతం డిపాజిట్ల ద్వారా తక్కువ వడ్డీ లభిస్తున్నందునే చాలా మంది వ్యక్తిగత గృహ పొదుపు విధానాల కంటే మ్యుచువల్ ఫండ్స్ లాంటి వాటిల్లో ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారని, వాటిల్లో రిటర్న్స్ అధికంగా వస్తుండడమే ఇందుకు కారణమని బ్యాంకింగ్ వర్గాలు ఆర్బీఐకి తెలిపాయి.
డిపాజిట్ల కన్నా రుణాల వృద్ధి రేటు ఎక్కువ..
బ్యాంకులు రుణాల వృద్ధికి సరిపడేలా డిపాజిట్లను ఎలా పెంచుకోవచ్చో సూచనలు ఇవ్వాలని ఆర్బీఐ కోరింది. ఈ చర్చలు భవిష్యత్తులో కొత్త రకాల డిపాజిట్ ఉత్పత్తులకు సంబంధించిన నియంత్రణ మార్పులకు దారితీయవచ్చని కూడా సమాచారం. అయితే ఈ విషయంపై ఆర్బీఐ అధికారికంగా స్పందించలేదు. ఇటీవల సంవత్సరాల్లో ఈ సమస్యపై చర్చలు జరిగినప్పటికీ, ఇప్పుడు దీనికి మరింత ఆవశ్యకత ఏర్పడిందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. బ్యాంకులు ప్రస్తుతం లిక్విడిటీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి, ఎందుకంటే అవి డిపాజిట్ల కంటే వేగంగా రుణాలు ఇస్తున్నాయి. ఆర్బీఐ గణాంకాల ప్రకారం మార్చి 15 నాటికి బ్యాంకుల డిపాజిట్ వృద్ధి వార్షిక ప్రాతిపదికన 10.8 శాతం కాగా, రుణాల వృద్ధి 13.8 శాతంగా నమోదైంది. అదనంగా బ్యాంకుల సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు కూడా పెరిగాయి, ఇది హోల్సేల్ ఫండింగ్ ఖర్చులు పెరిగినట్లు సూచిస్తోంది.
నిధుల సమీకరణ అవసరం..
ఫిబ్రవరి ద్రవ్య విధాన సమీక్ష అనంతరం ఆర్బీఐ అంతర్గతంగా పలు విభాగాల మధ్య సమావేశాలు నిర్వహించి, బ్యాంకుల ఫండ్ ఖర్చులు పెరగడానికి కారణమైన నిర్మాణాత్మక సమస్యలను, అలాగే అధిక క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తులను పరిశీలించింది. ఈ నెల విధాన సమీక్షకు ముందు ఆర్బీఐ సీనియర్ అధికారులు బ్యాంకుల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో బ్యాంకర్లు మరిన్ని నిధుల సమీకరణ పద్ధతులు అవసరమని సూచించారు. ప్రధానంగా ఒక సూచనగా ఆర్థిక సంస్థలకు తక్కువ వడ్డీ రేట్లు, రిటైల్ కస్టమర్లు, నాన్-ఫైనాన్షియల్ కంపెనీలకు ఎక్కువ వడ్డీ రేట్లు ఇవ్వడానికి బ్యాంకులకు అనుమతి ఇవ్వాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం బ్యాంకులు డిపాజిట్ పరిమాణం ఆధారంగా మాత్రమే వడ్డీ రేట్లలో తేడాలు చూపిస్తున్నాయి.

కొత్త డిపాజిట్ పద్ధతులను ప్రవేశపెడతారా..?
అదే విధంగా అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన కొత్త రకాల డిపాజిట్ పద్ధతులను ప్రవేశపెట్టడం గురించి కూడా చర్చ జరిగింది. ఉదాహరణకు ముందుగా సమాచారం ఇచ్చి మాత్రమే డబ్బు ఉపసంహరించుకునే నోటీస్ డిపాజిట్లు లేదా మార్కెట్ రాబడులకు అనుసంధానమైన వడ్డీ రేట్లు కలిగిన డిపాజిట్లను ప్రవేశపెట్టాలని బ్యాంకింగ్ వర్గాలు ఆర్బీఐని కోరినట్లు సమాచారం. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో ప్రజలు బ్యాంక్ డిపాజిట్ల నుండి ఈక్విటీలు, మ్యుచువల్ ఫండ్ల వైపు మళ్లుతున్నారు, ఎందుకంటే వాటి రాబడులు ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితి తీవ్రత అధికం కావడం వల్ల తాజా ఆర్బీఐ చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తులను పెంచడానికి చర్యలు..
కొన్ని బ్యాంకులు తమ క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తులను మెరుగుపరచడానికి రిటైల్ రుణాల పోర్ట్ఫోలియోలను విక్రయిస్తున్నాయి. బ్యాంక్ అధికారులు కూడా ఈ సవాళ్ల గురించి బహిరంగంగానే చెబుతున్నారు. కొన్ని నిధులు తిరిగి బ్యాంకులకు వస్తున్నప్పటికీ, అవి ఎక్కువగా ఆస్తి నిర్వహణ సంస్థల ద్వారా రావడం వల్ల స్థిరంగా ఉండవని భావిస్తున్నారు. ఇవి అధిక నియంత్రణ బఫర్లకు కారణం అవుతాయి. ఈ మార్పుల వల్ల బ్యాంకులకు రుణాలు, పెట్టుబడుల కోసం ఉపయోగించే నిధులు తగ్గుతున్నాయి. ఈ ధోరణి కొనసాగితే దేశ ఆర్థిక వృద్ధి లక్ష్యాలపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని ఆర్బీఐ అభిప్రాయపడుతోంది. అయితే ఈ విషయంలో ఆర్బీఐ ఎలాంటి చర్యలు చేపడుతుందోనని బ్యాంకింగ్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






