త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Crude Crisis | పెరుగుతున్న క్రూడాయిల్ ధ‌ర‌ల‌తో.. భారీ న‌ష్టాల్లో ప్ర‌భుత్వ ఆయిల్ కంపెనీలు..!

Crude Crisis | ఇరాన్‌, ఇజ్రాయెల్‌-యూఎస్ యుద్ధం ప్ర‌భావం క్రూడాయిల్‌పై ప‌డుతోంది. ప్ర‌పంచ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయిన‌ప్ప‌టికీ ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో ఇప్పటివరకు ఎలాంటి మార్పులు చేయలేదు.

P

Business | Published On Apr 15, 2026, 8.47 am IST

Crude Crisis | పెరుగుతున్న క్రూడాయిల్ ధ‌ర‌ల‌తో.. భారీ న‌ష్టాల్లో ప్ర‌భుత్వ ఆయిల్ కంపెనీలు..!
Advertisement

Crude Crisis | ఇరాన్‌, ఇజ్రాయెల్‌-యూఎస్ యుద్ధం ప్ర‌భావం క్రూడాయిల్‌పై ప‌డుతోంది. ప్ర‌పంచ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయిన‌ప్ప‌టికీ ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో ఇప్పటివరకు ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ కారణంగా ఆయిల్ కంపెనీల మార్జిన్లపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. పెట్రోల్‌పై లీటరుకు సుమారు రూ.18, డీజిల్‌పై లీటరుకు సుమారు రూ.35 మేర నష్టాలు వస్తున్నట్లు సమాచారం. మార్చి నెలలో వచ్చిన భారీ నష్టాలు జనవరి, ఫిబ్రవరి నెలల్లో వచ్చిన లాభాలను దాదాపు పూర్తిగా తుడిచిపెట్టినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో జనవరి–మార్చి త్రైమాసికంలో ఆయిల్ కంపెనీలు నష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉందని అంచనా.

ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మాక్వారీ (Macquarie) నివేదిక ప్రకారం.. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 135–165 డాలర్ల మధ్య కొనసాగితే నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంద‌ని అంచ‌నా వేసింది. క్రూడ్ ధరలు ప్రతి 10 డాలర్లు పెరిగినప్పుడు లీటరుకు సుమారు రూ.6 వరకు అదనపు నష్టం వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు 2022 ఏప్రిల్ తర్వాత రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. మార్చి వరకు ఈ మూడు కంపెనీలకు కలిపి రోజువారీగా సుమారు రూ.2,400 కోట్ల నష్టం వస్తున్నట్లు అంచనా. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు రూ.10 తగ్గించిన తర్వాత ఈ నష్టం సుమారు రూ.1,600 కోట్లకు తగ్గినట్లు తెలిపింది.

భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పునాదులు కలిగి ఉండటంతో క్రూడ్ షాక్‌ను కొంతవరకు తట్టుకోగలదని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, ముడి చమురు సగటు ధర బ్యారెల్‌కు సుమారు 130 డాలర్ల వద్ద కొనసాగితే దేశ ఆర్థిక వృద్ధి రేటు సుమారు 0.8 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా. రేటింగ్ సంస్థ ఎస్ అండ్ పీ ప్ర‌కారం.. 2026–27 కాలంలో ఆయిల్ కంపెనీల ఆపరేటింగ్ ఆదాయం 15 నుంచి 25 శాతం వరకు తగ్గే అవకాశం ఉన్న‌ది. దీని ప్రభావంతో కార్పొరేట్ రుణాలు, బ్యాంకింగ్ రంగంపై ఒత్తిడి పెరిగి, బ్యాంకుల నిరర్థక ఆస్తులు (NPA's) 3.5 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.

Advertisement
Advertisement