త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | సెన్సెక్స్ వరుసగా రెండో రోజు డౌన్.. మిడ్‌క్యాప్స్ దుమ్మురేపాయి..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. వరుసగా రెండో సెషన్‌లో కూడా ప్రధాన సూచీలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి హెవీవెయిట్ షేర్ల బలహీన ప్రదర్శన మార్కెట్లపై ప్రభావం చూపింది. అయితే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు మాత్రం మరోసారి మెరుగైన ర్యాలీ కొనసాగించాయి.

S

Business | Published On May 27, 2026, 4.11 pm IST

Stock Markets | సెన్సెక్స్ వరుసగా రెండో రోజు డౌన్.. మిడ్‌క్యాప్స్ దుమ్మురేపాయి..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. వరుసగా రెండో సెషన్‌లో కూడా ప్రధాన సూచీలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి హెవీవెయిట్ షేర్ల బలహీన ప్రదర్శన మార్కెట్లపై ప్రభావం చూపింది. అయితే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు మాత్రం మరోసారి మెరుగైన ర్యాలీ కొనసాగించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 141. 90 పాయింట్లు (0.19 శాతం) తగ్గి 75,867.80 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 50 సూచీ కేవ‌లం 6.55 పాయింట్లు (0.03 శాతం) త‌గ్గి 23,907.15 వద్ద స్థిర‌ప‌డింది. మరోవైపు విస్తృత మార్కెట్లలో మంచి కొనుగోళ్లు కనిపించాయి. బీఎస్‌ఈ 150 మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.83 శాతం ఎగబాక‌గా, బీఎస్‌ఈ 250 స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.49 శాతం లాభపడింది. అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై స్పష్టత రాకపోవడంతో ఇన్వెస్టర్లలో జాగ్రత్త ధోరణి కొనసాగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే బ్రెంట్ క్రూడ్ ధరలు 3 శాతానికి పైగా పడిపోవడం మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడిని కొంతవరకు అడ్డుకుంది. ఇక భారత రూపాయి డాలర్‌తో పోలిస్తే 1 పైస‌ బలపడి 95.69 వద్ద ముగిసింది.

హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు భారీగా ప‌త‌నం..

సెన్సెక్స్‌పై అత్యధిక ఒత్తిడి తీసుకొచ్చిన షేర్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌. ఆ బ్యాంక్ షేరు 2.63 శాతం పడిపోయి రూ.758.50 వద్ద ముగిసింది. ఒక ప్రభుత్వ సంస్థకు రూ.45 కోట్ల వడ్డీ చెల్లింపులపై అంతర్గత విచారణ జరుగుతోందన్న వార్తల నేపథ్యంలో ఈ పతనం నమోదైంది. అలాగే రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఐటీసీ షేర్లు కూడా సెన్సెక్స్ ప‌త‌నానికి కార‌ణ‌మ‌య్యాయి. ఇటీవల మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సెగ్మెంట్లలో కనిపిస్తున్న ఔట్‌పర్‌ఫార్మెన్స్‌కు ప్రధాన కారణం నాలుగో త్రైమాసిక ఫలితాలు అంచనాలకు మించి రావడమేనని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్ర‌ముఖ వ్యూహ‌క‌ర్త వినోద్ నాయ‌ర్ మాట్లాడుతూ ప్రధాన సూచీలు రేంజ్‌బౌండ్‌లో కొనసాగుతున్నప్పటికీ, దేశీయ ఇన్‌ఫ్లోలు పెరగడం వల్ల మిడ్‌క్యాప్స్ కొత్త బలాన్ని అందుకున్నాయని చెప్పారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలను దేశీయ పెట్టుబడులు సమతుల్యం చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

బ‌ల‌హీనంగా బెంచ్ మార్క్ సూచీలు..

ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, ఇటీవల ర్యాలీ తర్వాత లాభాల స్వీకరణ కొనసాగడం వల్ల భారత మార్కెట్లు బలహీనంగా ముగిశాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, బ్లూచిప్ షేర్ల బలహీనత ప్రభావం చూపగా, ఆటో, పీఎస్‌యూ, మెటల్స్ రంగాల్లో కొనుగోళ్లు మార్కెట్ సెంటిమెంట్‌కు మద్దతిచ్చాయని తెలిపారు. ప్రధాన సూచీలు నష్టాల్లో ముగిసినా, విస్తృత మార్కెట్ల ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరిగింది. ఒక్క రోజులోనే దాదాపు రూ.2 లక్షల కోట్ల మేర సంపద వ‌చ్చి ప‌డింది. బీఎస్‌ఈలో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.469 లక్షల కోట్ల నుంచి దాదాపు రూ.471 లక్షల కోట్లకు చేరుకుంది.

Advertisement
Advertisement