Stock Markets | భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారుల్లో పెరిగిన ఆసక్తి..
Stock Markets | అమెరికా-ఇరాన్ల మధ్య రెండో దఫా శాంతి చర్చలపై పాజిటివ్ సంకేతాలు వెలువడుతుండడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన తగ్గి కొనుగోళ్ల పట్ల ఆసక్తి పెరిగింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీగా లాభపడ్డాయి. ఫ్రంట్లైన్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ50 బలమైన ర్యాలీని కొనసాగించాయి.
Stock Markets | అమెరికా-ఇరాన్ల మధ్య రెండో దఫా శాంతి చర్చలపై పాజిటివ్ సంకేతాలు వెలువడుతుండడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన తగ్గి కొనుగోళ్ల పట్ల ఆసక్తి పెరిగింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీగా లాభపడ్డాయి. ఫ్రంట్లైన్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ50 బలమైన ర్యాలీని కొనసాగించాయి. సెన్సెక్స్ 753.03 పాయింట్లు (0.96 శాతం) పెరిగి 79,273.33 వద్ద ముగియగా, నిఫ్టీ50 సూచీ 211.75 పాయింట్ల (0.87 శాతం) లాభంతో 24,576.60 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్క్యాప్100 సూచీ 0.49 శాతం లాభపడగా, నిఫ్టీ స్మాల్క్యాప్100 సూచీ 0.88 శాతం పెరిగింది. బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సెషన్లోని సుమారు రూ.466 లక్షల కోట్ల నుంచి దాదాపు రూ.469 లక్షల కోట్లకు పెరిగింది. దీంతో ఒక్క సెషన్లోనే పెట్టుబడిదారులు సుమారు రూ.3 లక్షల కోట్లు ఆర్జించారు.
35 షేర్లు లాభాల్లో..
నిఫ్టీ50 సూచీలో 35 షేర్లు లాభాలతో ముగియగా, నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనిలివర్, ట్రెంట్ అగ్రగామిగా నిలిచాయి. మరోవైపు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్), జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు పతనమయ్యాయి. రంగాల సూచీలలో నిఫ్టీ బ్యాంక్ 1.39 శాతం లాభంతో ముగియగా, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీ 1.18 శాతం పెరిగింది. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 2.55 శాతం పెరగ్గా, రియాల్టీ 2.14 శాతం పెరిగింది. నిఫ్టీ ఫార్మా 0.08 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 0.02 శాతం నష్టపోయాయి.
ఆసియా మార్కెట్లు లాభాల్లోనే..
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చల ఆశల నడుమ ఆసియా మార్కెట్లు లాభాలతో ముగియగా, అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరాన్తో చర్చల కోసం పాకిస్థాన్కు వెళ్లనున్నారని వార్తలు వచ్చాయి. ఈ చర్చలకు హాజరయ్యేందుకు టెహ్రాన్ ప్రతినిధులకు ఇరాన్ సుప్రీం లీడర్ నుంచి చివరి నిమిషంలో అనుమతి లభించిందని ఆక్సియోస్ వెల్లడించింది. అయితే చర్చల విషయమై ఇంకా స్పష్టత రాలేదు. అయినప్పటికీ పెట్టుబడిదారులు మాత్రం ఆశావహ దృక్పథంతోనే ఉన్నట్లు మార్కెట్లలో వచ్చిన ర్యాలీతో స్పష్టమవుతోంది.
తగ్గిన చమురు ధరలు..
ఈ వారం అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు జరుగుతాయనే అంచనాలతో ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ ఫ్యూచర్స్ 0.46 శాతం తగ్గి బ్యారెల్కు 95.04 డాలర్లకు చేరగా, మే నెలకు సంబంధించిన యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ 1.35 శాతం తగ్గి బ్యారెల్కు 88.40 డాలర్లకు పడిపోయాయి. అలాగే గత సెషన్లో వారం రోజుల కనిష్టానికి పడిపోయిన తర్వాత బంగారం ధరలు చాలా వరకు స్థిరంగా కొనసాగాయి. స్పాట్ బంగారం ధర ఔన్సుకు 4,820.84 డాలర్ల వద్ద స్థిరంగా ఉండగా, జూన్ డెలివరీకి సంబంధించిన యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి 4,841.2 డాలర్లకు చేరుకున్నాయి. స్పాట్ వెండి ధర 0.1 శాతం తగ్గి ఔన్సుకు 79.82 డాలర్లకు పడిపోయింది. భారత్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఎంసీఎక్స్ జూన్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు బంగారం ధర 10 గ్రాములకు రూ.218 (0.14 శాతం) తగ్గి రూ.1,53,725 వద్ద ఉంది. మే ఫ్యూచర్స్ కాంట్రాక్టు వెండి ధర కిలోకు రూ.1,824 (0.72 శాతం) తగ్గి రూ.2,50,721 వద్ద ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



