త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్.. మార్కెట్‌లో మళ్లీ స్వ‌ల్ప లాభాలు..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్‌, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. వరుసగా నాలుగు రోజులుగా కొనసాగిన నష్టాల పరంపరకు బ్రేక్ పడింది. సెన్సెక్స్‌ 50 పాయింట్లు (0.07 శాతం) పెరిగి 74,608.98 వద్ద ముగిసింది. అదే సమయంలో నిఫ్టీ 50 సూచీ 33 పాయింట్లు (0.14 శాతం) లాభపడి 23,412.60 వద్ద స్థిర ప‌డింది.

S

Business | Published On May 13, 2026, 4.02 pm IST

Stock Markets | నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్.. మార్కెట్‌లో మళ్లీ స్వ‌ల్ప లాభాలు..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్‌, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. వరుసగా నాలుగు రోజులుగా కొనసాగిన నష్టాల పరంపరకు బ్రేక్ పడింది. సెన్సెక్స్‌ 50 పాయింట్లు (0.07 శాతం) పెరిగి 74,608.98 వద్ద ముగిసింది. అదే సమయంలో నిఫ్టీ 50 సూచీ 33 పాయింట్లు (0.14 శాతం) లాభపడి 23,412.60 వద్ద స్థిర ప‌డింది. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సెగ్మెంట్లు ప్రధాన సూచీల కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. బీఎస్ఈ 150 మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.71 శాతం పెరగగా, బీఎస్ఈ 250 స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.27 శాతం ఎగ‌బాకింది. మార్కెట్‌ పెరుగుదలతో బీఎస్ఈలో లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్‌ గత సెషన్‌లోని రూ.456 లక్షల కోట్ల నుంచి దాదాపు రూ.459 లక్షల కోట్లకు చేరింది. ఒక్కరోజులోనే ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.3 లక్షల కోట్ల మేర పెరిగింది.

విలువ ఆధారిత కొనుగోళ్ల‌కు మొగ్గు..

ఇటీవలి పతనంతో సెన్సెక్స్‌, నిఫ్టీ రెండూ సుమారు 4 శాతం వరకు పడిపోవడంతో, భారీ షేర్లలో విలువ ఆధారిత కొనుగోళ్లు చోటు చేసుకోవ‌డం మార్కెట్‌కు మద్దతుగా నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం కూడా సెంటిమెంట్‌ను బలపరిచింది. అయితే రూపాయి బలహీనత మార్కెట్‌ లాభాలను పరిమితం చేసింది. భారత రూపాయి అమెరికన్ డాలర్‌తో పోలిస్తే ఆల్‌టైమ్ క్లోజింగ్ లో స్థాయికి పడిపోయింది. రూపాయి విలువ డాల‌ర్‌కు 95.71 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 1 శాతం తగ్గి బ్యారెల్‌కు 107 డాలర్ల సమీపంలో ట్రేడ్ అయింది. జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ మాట్లాడుతూ దేశీయ సూచీలు జాగ్రత్త ధోరణితో ఫ్లాట్‌గా ముగిశాయని, అయితే మిడ్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లలో డిప్ బైయింగ్‌, షార్ట్ కవరింగ్ కారణంగా విస్తృత మార్కెట్‌లు మెరుగైన ప్రదర్శన ఇచ్చాయ‌ని చెప్పారు.

మిశ్ర‌మ ధోర‌ణి..

నిఫ్టీ 50లో 25 షేర్లు లాభాల్లో ముగియగా, మరో 25 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఏషియ‌న్ పెయింట్స్‌, అదాని ఎంటర్ ప్రైజెస్‌, టాటా స్టీల్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఐష‌ర్ మోటార్స్‌, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా, ఇన్ఫోసిస్ టాప్ లూజర్స్‌గా ముగిశాయి. సెక్టోరల్ సూచీల్లో నిఫ్టీ మెట‌ల్ 3.18 శాతం పెరిగి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. కన్జూమర్ డ్యూరబుల్స్‌ ఇండెక్స్‌ 1.67 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్‌ ఇండెక్స్‌ 1.28 శాతం పెరిగాయి. అదే సమయంలో నిఫ్టీ ఐటీ 1.13 శాతం పడిపోగా, ఆటో ఇండెక్స్‌ 1 శాతం నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ 0.18 శాతం తగ్గింది.

Advertisement
Advertisement