Stock Markets | స్వల్ప లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. యుద్ధం వార్తలపైనే ఎదురు చూపులు..
Stock Markets | దేశీయ స్టాక్మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభంలో స్వల్ప నష్టాలతో మొదలైనప్పటికీ అనంతరం లాభాల దిశగా పయనిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ, అమెరికా-ఇరాన్ యుద్ధం త్వరలో ముగిసే అవకాశాలపై ఉన్న ఆశావాదం మార్కెట్లను నిలబెట్టింది.
Stock Markets | దేశీయ స్టాక్మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభంలో స్వల్ప నష్టాలతో మొదలైనప్పటికీ అనంతరం లాభాల దిశగా పయనిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చినప్పటికీ, అమెరికా-ఇరాన్ యుద్ధం త్వరలో ముగిసే అవకాశాలపై ఉన్న ఆశావాదం మార్కెట్లను నిలబెట్టింది. సెన్సెక్స్ 267 పాయింట్లు (0.35 శాతం) పెరిగి 78,250 వద్ద ఉండగా, నిఫ్టీ 50 సూచీ 70 పాయింట్లు (0.32 శాతం) పెరిగి 24,277 వద్ద కొనసాగుతోంది. అయితే ప్రధాన సూచీల కంటే విస్తృత మార్కెట్లు మెరుగైన ప్రదర్శన చూపించాయి. నిఫ్టీ మిడ్క్యాప్ 100, నిఫ్టీ స్మాల్క్యాప్ 100 సూచీలు రెండూ 0.5 శాతం కన్నా ఎక్కువ లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఆసియా మార్కెట్లు పతనం..
సెక్టార్ల వారీగా చూస్తే నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ఆయిల్, గ్యాస్, నిఫ్టీ ఆటో, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ మీడియా సూచీలు లాభాల్లో ఉండగా, నిఫ్టీ మెటల్స్, నిఫ్టీ ఫార్మా సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రపంచ మార్కెట్లలో ఆసియా మార్కెట్లు పతనమవుతుండగా, అమెరికా స్టాక్ మార్కెట్ గత రాత్రి లాభాలతో ముగిసింది. ముఖ్యంగా నాస్డాక్ వరుసగా 12వ సెషన్లో పెరుగుదల నమోదు చేసి, జూలై 2009 తర్వాత ఇదే దీర్ఘకాల లాభాల పరంపరగా నిలిచింది. కాగా లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా-ఇరాన్ మధ్య తదుపరి చర్చలు వీకెండ్లో జరగవచ్చని తెలిపారు. అలాగే ఇరాన్ వచ్చే 20 సంవత్సరాలపాటు అణు ఆయుధాలను కలిగి ఉండబోమని ప్రతిపాదించినట్లు ట్రంప్ వెల్లడించారు.
బలపడ్డ రూపాయి..
ఇక ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి కాస్త బలపడింది. శుక్రవారం నాటి సెషన్లో రూపాయి విలువ 30 పైసలు పెరిగి డాలర్కు 92.7 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరల పతనం కూడా మార్కెట్లు పడిపోకుండా కాపాడింది. బ్రెంట్ క్రూడ్ ధర ప్రస్తుతం బ్యారెల్కు 93 డాలర్ల వద్ద ఉండగా ఇది క్రితం సెషన్ తో పోలిస్తే 0.01 శాతం మేర స్వల్పంగా తగ్గింది. అలాగే డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్కు 0.01 శాతం పెరిగి 89 డాలర్ల వద్ద ఉంది. అయితే అమెరికా-ఇరాన్ మధ్య చర్చల ముగింపు, యుద్ధం పూర్తిగా నిలిపివేయడం వంటి వార్తల కోసం మార్కెట్లు ఎదురు చూస్తున్నాయి. ఈ క్రమంలో పెట్టుబడిదారుల్లో ప్రతి క్షణం ఉత్కంఠ నెలకొంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



