Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. ఐటీ షేర్ల ర్యాలీ..
Stock Markets | అమెరికా చిప్ దిగ్గజం ఎన్విడియా బలమైన ఆర్థిక ఫలితాలు, ఆశాజనక అంచనాలతో షేర్లు భారీగా పెరగడంతో శుక్రవారం భారత ఐటీ షేర్లలో జోష్ కనిపించింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ సహా పలు ఐటీ కంపెనీల షేర్లు 2 నుంచి 4 శాతం వరకు దూసుకెళ్లాయి.
Stock Markets | అమెరికా చిప్ దిగ్గజం ఎన్విడియా బలమైన ఆర్థిక ఫలితాలు, ఆశాజనక అంచనాలతో షేర్లు భారీగా పెరగడంతో శుక్రవారం భారత ఐటీ షేర్లలో జోష్ కనిపించింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ సహా పలు ఐటీ కంపెనీల షేర్లు 2 నుంచి 4 శాతం వరకు దూసుకెళ్లాయి. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాణిజ్యంపై మళ్లీ ఆశావాదం పెరగడం ఈ ర్యాలీకి ప్రధాన కారణంగా నిలిచింది. ఉదయం 9:36 గంటల సమయంలో నిఫ్టీ ఐటీ సూచీ 2.92 శాతం ఎగబాకి 31,103.45 పాయింట్లకు చేరింది. దీంతో అన్ని రంగాల సూచీల్లో ఐటీ అగ్రస్థానంలో నిలిచింది. నిఫ్టీ ఐటీ సూచీలోని మొత్తం 10 కంపెనీల షేర్లు లాభాల్లోనే ట్రేడయ్యాయి. నిఫ్టీ 50లో అత్యధిక లాభాలు సాధించిన షేర్ల జాబితాలోనూ ఐటీ కంపెనీలే ఆధిపత్యం ప్రదర్శించాయి. టీసీఎస్ షేర్ 3.5 శాతం పెరిగి రూ.2,327కు చేరింది. టెక్ మహీంద్రా 3 శాతం లాభపడి రూ.1,632.90 వద్ద ట్రేడైంది. హెచ్సీఎల్ టెక్నాలజీస్ 2.75 శాతం పెరిగి రూ.1,317.20కు చేరింది. ఇన్ఫోసిస్ 2.63 శాతం లాభంతో రూ.1,140కు చేరుకోగా, విప్రో 1.89 శాతం పెరిగి రూ.179.74 వద్ద నిలిచింది. ఉదయం ట్రేడింగ్లో నిఫ్టీ 50లో అత్యధిక లాభాలు సాధించిన ఐదు షేర్లుగా ఈ ఐటీ స్టాక్స్ నిలిచాయి.
ఐటీ షేర్ల మద్దతు..
అమెరికా మార్కెట్లలో ఎన్విడియా షేర్లు దాదాపు 9 శాతం ఎగబాకడం భారత ఐటీ షేర్ల ర్యాలీకి ప్రధాన ప్రేరణగా మారింది. బలమైన ఫలితాలను ప్రకటించడంతోపాటు భవిష్యత్తుపై ఆశాజనక అంచనాలను ఎన్విడియా వెల్లడించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పెట్టుబడుల వృద్ధి కొనసాగుతుందన్న నమ్మకం ఇన్వెస్టర్లలో పెరిగింది. ఎన్విడియా ఫలితాలు గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వృద్ధి ఎంతకాలం కొనసాగుతుందనే అంశంపై ఇన్వెస్టర్లకు మరింత భరోసా ఇచ్చాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రైమ్ రీసెర్చ్ హెడ్ దేవర్ష్ వకీల్ తెలిపారు. ఈ పరిణామంతో టెక్నాలజీ షేర్లలో కొనుగోళ్లు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు తగ్గడం కూడా ఈక్విటీ మార్కెట్ల జోష్కు కారణమైంది. బ్రెంట్ క్రూడ్ ధర 0.30 శాతం తగ్గి బ్యారెల్కు 87 డాలర్లకు చేరగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 0.26 శాతం తగ్గి బ్యారెల్కు 83 డాలర్లకు దిగి వచ్చింది. ఫారెక్స్ మార్కెట్లో భారత రూపాయి కాస్త బలహీనపడింది. అమెరికా డాలర్తో పోలిస్తే 0.02 శాతం నష్టపోయిన రూపాయి 95.55 వద్ద నిలిచింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Tirupati Rao | రెండున్నరేండ్లు గడిచినా.. ఒక్క హామీ నెరవేర్చని కాంగ్రెస్ సర్కార్: తిరుపతి రావు
- ●Earrings Stolen | నేపాల్ విషాదం వేళ అమానవీయ ఘటన.. మహిళ మృతదేహం నుంచి చెవి పోగులు దోచుకున్న నీచులు
- ●Nepal Flash Floods | నేపాల్ జలప్రళయంలో 469 మంది మృతి.. 1,498 మంది ఆచూకీ గల్లంతు
- ●KTR | న్యాయాన్ని అపహాస్యం చేసేలా ఎన్సీఎల్టీ తీరు..: కేటీఆర్
- ●Government Teachers | ఆర్ఎస్ఎస్ మార్చ్లో పాల్గొన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు.. సస్పెండ్ చేసిన సర్కార్
- ●Traffic Restrictions | హైదరాబాద్ మారథాన్.. ఆగస్టు 30న నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

Tirupati Rao | రెండున్నరేండ్లు గడిచినా.. ఒక్క హామీ నెరవేర్చని కాంగ్రెస్ సర్కార్: తిరుపతి రావు

Earrings Stolen | నేపాల్ విషాదం వేళ అమానవీయ ఘటన.. మహిళ మృతదేహం నుంచి చెవి పోగులు దోచుకున్న నీచులు

Nepal Flash Floods | నేపాల్ జలప్రళయంలో 469 మంది మృతి.. 1,498 మంది ఆచూకీ గల్లంతు

KTR | న్యాయాన్ని అపహాస్యం చేసేలా ఎన్సీఎల్టీ తీరు..: కేటీఆర్






