Stock Markets | ఫ్లాట్గా ట్రేడవుతున్న సూచీలు.. కాస్త రికవర్ అయిన ఐటీ షేర్లు..
Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు బుధవారం జాగ్రత్త ధోరణిలో ప్రారంభమయ్యాయి. ముడి చమురు ధరలు తగ్గడం, ఐటీ షేర్లలో పుంజుకోవడం మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ కఠిన వైఖరి, బలహీనమైన గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ కారణంగా పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
Stock Markets | భారత స్టాక్ మార్కెట్లు బుధవారం జాగ్రత్త ధోరణిలో ప్రారంభమయ్యాయి. ముడి చమురు ధరలు తగ్గడం, ఐటీ షేర్లలో పుంజుకోవడం మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ కఠిన వైఖరి, బలహీనమైన గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ కారణంగా పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రారంభ ట్రేడింగ్లో బీఎస్ఈ సెన్సెక్స్ 113.27 పాయింట్లు పెరిగి 76,313.95 వద్దకు చేరుకోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 సూచీ 22.15 పాయింట్లు లాభపడి 23,845.50 వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో నమోదైన భారీ అమ్మకాల తరువాత మార్కెట్లు కాస్త రికవర్ అయ్యాయి. మంగళవారం సెషన్ లో ఐటీ షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ బుధవారం సెషన్లో పెట్టుబడిదారులు ఇవే షేర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారు. దీంతో టెక్ మహీంద్రా 2.70 శాతం ఎగబాకగా, ఇన్ఫోసిస్ 1.46 శాతం, టీసీఎస్ 0.65 శాతం లాభపడ్డాయి. దీంతో నిఫ్టీ ఐటీ సూచీ 1 శాతానికి పైగా పెరిగింది.
తగ్గిన చమురు ధరలు..
దక్షిణ కొరియా మార్కెట్లలో మంగళవారం సెమీకండక్టర్ స్టాక్స్లో జరిగిన భారీ కరెక్షన్ తర్వాత ఆసియా వ్యాప్తంగా టెక్నాలజీ ఆధారిత అమ్మకాల భయాలు నెలకొన్నాయి. అయితే బుధవారం అక్కడి మార్కెట్లు కోలుకోవడంతో భారత ఐటీ షేర్లకు కూడా ఊరట లభించింది. జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వీకే విజయకుమార్ మాట్లాడుతూ దక్షిణ కొరియా, తైవాన్ వంటి సెమీకండక్టర్ ఆధారిత మార్కెట్లలో అస్థిరత కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధి లక్షణాల కారణంగా ఇతర ఆసియా మార్కెట్లతో పోలిస్తే మెరుగైన స్థితిలో ఉందని పేర్కొన్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర 0.14 శాతం తగ్గి బ్యారెల్కు 76 డాలర్ల వద్ద ఉండగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 0.34 శాతం పడిపోయి బ్యారెల్కు 72 డాలర్ల వద్ద నిలిచింది. ఫారెక్స్ మార్కెట్లో భారత రూపాయి విలువ మరోమారు తగ్గింది. అమెరికా డాలర్తో పోలిస్తే 11 పైసలు తగ్గిన రూపాయి 94.83 వద్ద ట్రేడైంది.
ఫార్మా, హెల్త్ కేర్ రంగాలు లాభాల్లో..
డిఫెన్సివ్ రంగాలకు చెందిన ఫార్మా షేర్లలో కూడా కొనుగోళ్లు కొనసాగాయి. నిఫ్టీ ఫార్మా సూచీ 0.88 శాతం పెరగగా, నిఫ్టీ హెల్త్కేర్ సూచీ 0.77 శాతం లాభపడింది. సన్ ఫార్మా సెన్సెక్స్లో టాప్ గెయినర్లలో ఒకటిగా నిలిచి 0.48 శాతం పెరిగింది. వర్షాకాలం అనిశ్చితి, గ్రామీణ డిమాండ్పై ఆందోళనల నేపథ్యంలో ఫార్మాసూటికల్ కంపెనీల షేర్లు తక్కువ రిస్క్తో ఉన్న పెట్టుబడులుగా పెట్టుబడిదారులు భావిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాన సూచీలు లాభాల్లో ఉన్నప్పటికీ విస్తృత మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించింది. నిఫ్టీ మిడ్క్యాప్ 50 సూచీ 0.21 శాతం పెరగగా, నిఫ్టీ మిడ్క్యాప్ 100 కేవలం 0.05 శాతం మాత్రమే లాభపడింది. నిఫ్టీ స్మాల్క్యాప్ 100 మాత్రం స్వల్ప నష్టాల్లో ఉంది. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ, ఫార్మా, ప్రైవేట్ బ్యాంక్ సూచీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఆటో, మీడియా, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాల్లో మాత్రం స్వల్ప బలహీనత కనిపించింది.
తాజావార్తలు
- ●Meta Arena | మెటా నుంచి కొత్త ప్లాట్ఫామ్.. డబ్బుతో అవసరం లేని బెట్టింగ్ వేదిక..
- ●Revanth Reddy | సర్పై మరింత అప్రమత్తంగా ఉండండి.. అలాంటి వారిపై చర్యలు తప్పవు: సీఎం రేవంత్
- ●Shree Charani | ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. వరల్డ్ నెంబర్ వన్ బౌలర్గా శ్రీ చరణి
- ●Colombia Vs DR Congo | కొలంబియాను గెలిపించిన మునోజ్
- ●Ketan Agarwal Murder Case | 33 డిగ్రీల ఎండలోనూ హుడీ ధరించి.. కేతన్ హత్య కేసు నిందితులను పట్టించిన సీసీటీవీ ఫుటేజ్
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడిదారుల నిరాసక్తత..?

Meta Arena | మెటా నుంచి కొత్త ప్లాట్ఫామ్.. డబ్బుతో అవసరం లేని బెట్టింగ్ వేదిక..

Revanth Reddy | సర్పై మరింత అప్రమత్తంగా ఉండండి.. అలాంటి వారిపై చర్యలు తప్పవు: సీఎం రేవంత్

Shree Charani | ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. వరల్డ్ నెంబర్ వన్ బౌలర్గా శ్రీ చరణి

Colombia Vs DR Congo | కొలంబియాను గెలిపించిన మునోజ్






