Stock Markets | భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. పెరిగిన చమురు ధరలు..
Stock Markets | అమెరికా-ఇరాన్ల మధ్య రెండో దఫా శాంతి చర్చలపై అనిశ్చితి నెలకొనడం, మరోవైపు ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం శుక్రవారం భారీ అమ్మకాల ఒత్తిడిలో కొనసాగుతున్నాయి.
Stock Markets | అమెరికా-ఇరాన్ల మధ్య రెండో దఫా శాంతి చర్చలపై అనిశ్చితి నెలకొనడం, మరోవైపు ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం శుక్రవారం భారీ అమ్మకాల ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు, మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతలు పెట్టుబడిదారుల భావోద్వేగాలను దెబ్బతీశాయి. దీంతో మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభంలోనే 180.20 పాయింట్లు (0.23 శాతం) తగ్గి 77,483.80 వద్ద ఓపెన్ అయింది. అలాగే నిఫ్టీ50 సూచీ 72.50 పాయింట్లు (0.30 శాతం) పడిపోయి 24,100.55 వద్ద ప్రారంభమైంది. అయితే ట్రేడింగ్ కొనసాగుతున్న కొద్దీ అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగి సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా క్షీణించగా, నిఫ్టీ 24,000 స్థాయికి దిగువకు చేరింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 0.5 శాతం కన్నా ఎక్కువగా పడిపోయింది.
విస్తృత సూచీలు సైతం..
విస్తృత మార్కెట్లు కూడా ఒత్తిడికి లోనయ్యాయి. నిఫ్టీ స్మాల్క్యాప్ 100, నిఫ్టీ మిడ్క్యాప్ 100 సూచీలు రెండూ 0.5 శాతం కన్నా ఎక్కువగా పడిపోయాయి. రంగాల వారీగా చూస్తే అన్ని సూచీలు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా నిఫ్టీ ఐటీ, మెటల్, ఫార్మా, మీడియా, ఆటో, ప్రైవేట్ బ్యాంక్ సూచీలు భారీగా నష్టపోయాయి. ఇక ప్రపంచ మార్కెట్ల పరిస్థితి మిశ్రమంగా ఉంది. ఆసియా మార్కెట్లు విభిన్న ధోరణిలో ట్రేడ్ అవుతుండగా, అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. వాల్ స్ట్రీట్ సూచీలు తమ రికార్డు గరిష్ఠ స్థాయిల నుండి వెనక్కి తగ్గాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణను మరో మూడు వారాలు పొడిగించేందుకు అంగీకరించారని ప్రకటించారు. అలాగే ఇరాన్పై అమలు చేస్తున్న దిగ్బంధ చర్యలపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని, అవి ప్రభావవంతంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ క్రమంలో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి.
పెరిగిన చమురు ధరలు..
మధ్యప్రాచ్యంలో మళ్లీ సైనిక ఉద్రిక్తతలు పెరిగే భయంతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 1.17 శాతం పెరిగి బ్యారెల్కు 106.3 డాలర్లకు చేరుకోగా, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ఫ్యూచర్స్ 1.12 శాతం పెరిగి 96.92 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, వారాంతానికి తగ్గుదల దిశగా సాగుతున్నాయి. అధిక ఆయిల్ ధరలు ద్రవ్యోల్బణ భయాలను పెంచడం, వడ్డీ రేట్లు ఎక్కువకాలం ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే కొనసాగుతాయనే అంచనాలు దీనికి కారణంగా మారాయి. స్పాట్ గోల్డ్ ధర ఔన్స్కు 4,697 డాలర్ల వద్ద ఉండగా, ఇది క్రితం సెషన్ ముగింపుతో పోలిస్తే 0.1 శాతం పెరిగింది. అయితే ఈ వారం మొత్తం మీద 2.6 శాతం తగ్గింది. జూన్ డెలివరీకి యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం తగ్గి 4,712.50 డాలర్ల వద్ద ఉన్నాయి. స్పాట్ సిల్వర్ ధర కూడా 0.1 శాతం తగ్గి ఔన్స్కు 75.36 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



