త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | రెండు రోజుల నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ వేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావ‌డం, ముడి చమురు ధరలు తగ్గడం మార్కెట్ సెంటిమెంట్‌ను మెరుగుపరచడంతో శుక్రవారం బెంచ్‌మార్క్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 331 పాయింట్లు (0.43 శాతం) లాభపడి 77,264.51 వద్ద స్థిరపడింది.

S

Business | Published On Aug 28, 2026, 4.14 pm IST

Stock Markets | రెండు రోజుల నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ వేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావ‌డం, ముడి చమురు ధరలు తగ్గడం మార్కెట్ సెంటిమెంట్‌ను మెరుగుపరచడంతో శుక్రవారం బెంచ్‌మార్క్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 331 పాయింట్లు (0.43 శాతం) లాభపడి 77,264.51 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 సూచీ 85 పాయింట్లు (0.35 శాతం) పెరిగి 24,175.65 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్‌ల‌లోనూ కొనుగోళ్ల మద్దతు కనిపించింది. బీఎస్ఈ 150 మిడ్‌క్యాప్ సూచీ 0.16 శాతం పెరగగా, బీఎస్ఈ 250 స్మాల్‌క్యాప్ సూచీ 0.33 శాతం లాభపడింది. దీంతో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాల్లోనూ ఇన్వెస్టర్లకు కొంత ఊరట లభించింది. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు దౌత్యపరమైన పరిష్కారం కోసం ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ముడి చమురు ధరలు తగ్గడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 90 డాలర్ల దిగువకు చేరి 89.17 డాలర్ల నుంచి 87.63 డాలర్లకు పడిపోయాయి.

ప్ర‌పంచ మార్కెట్ల నుంచి పాజిటివ్ సంకేతాలు..

ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు కూడా భారత ఈక్విటీ మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. ఫ్రాన్స్‌కు చెందిన క్యాక్ సూచీ 1 శాతానికి పైగా పెరగగా, జర్మనీకి చెందిన డ్యాక్స్, బ్రిటన్‌కు చెందిన ఎఫ్‌టీఎస్ఈ సూచీలు కూడా అర శాతం వరకు లాభపడ్డాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ కెవిన్ వార్ష్ జాక్సన్ హోల్ సింపోజియంలో చేయనున్న ప్రసంగంపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. దేశీయ మార్కెట్లలో ఎంపిక చేసిన ఐటీ, బ్యాంకింగ్ దిగ్గజాల షేర్లలో కొనుగోళ్లు సూచీలకు ప్రధానంగా మద్దతు ఇచ్చాయి. సెన్సెక్స్‌లో ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు సూచీ లాభాలకు అత్యధికంగా దోహదపడ్డాయి. అయితే ఐసీఐసీఐ బ్యాంక్ షేరు సెన్సెక్స్‌పై అత్యధిక ప్రతికూల ప్రభావాన్ని చూపింది. సెన్సెక్స్‌లో టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, టైటాన్ షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ షేర్లు టాప్ లూజర్లుగా ముగిశాయి.

ఐటీ షేర్ల ర్యాలీ..

నిఫ్టీ షేర్లలో టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ రంగ షేర్లలో భారీ కొనుగోళ్లు జరిగాయి. నిఫ్టీ ఐటీ సూచీ ఏకంగా 3.51 శాతం దూసుకెళ్లింది. అమెరికాకు చెందిన చిప్ దిగ్గజం ఎన్విడియా బలమైన ఆర్థిక ఫలితాలు, ఆదాయ అంచనాలు ఐటీ రంగంపై ఇన్వెస్టర్లలో ఆశావహతను పెంచాయి. కృత్రిమ మేధస్సు ఆధారిత పెట్టుబడులు కొనసాగుతాయన్న అంచనాలు భారత ఐటీ కంపెనీల షేర్లకు కూడా మద్దతు ఇచ్చాయి.

Advertisement
Advertisement