త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | చమురు ధరల సెగ.. మూడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Stock Markets | మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో ముడి చమురు ధరలు ఎగబాకాయి. దీంతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు, వడ్డీ రేట్లు మరింత కఠినంగా మారవచ్చన్న అంచనాలు పెరగడంతో భారత స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్‌లోనూ నష్టాల్లో ముగిశాయి. బుధవారం కీలక సూచీలు ముఖ్యమైన స్థాయిలకు దిగువకు చేరాయి.

S

Business | Published On Sep 2, 2026, 3.57 pm IST

Stock Markets | చమురు ధరల సెగ.. మూడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
Advertisement

Stock Markets | మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో ముడి చమురు ధరలు ఎగబాకాయి. దీంతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు, వడ్డీ రేట్లు మరింత కఠినంగా మారవచ్చన్న అంచనాలు పెరగడంతో భారత స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్‌లోనూ నష్టాల్లో ముగిశాయి. బుధవారం కీలక సూచీలు ముఖ్యమైన స్థాయిలకు దిగువకు చేరాయి. అధిక ముడి చమురు ధరల ప్రభావంతో ప్రపంచ బాండ్ ఈల్డ్స్‌ కూడా పలు సంవత్సరాల గరిష్ఠాలకు చేరుకోవడం, అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన పరిస్థితులు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడి తెచ్చాయి. నిఫ్టీ 50 సూచీ 0.59 శాతం నష్టంతో 23,914 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఒక దశలో 23,786 కనిష్ఠానికి పడిపోయిన నిఫ్టీ, చివరి గంటల్లో కొనుగోళ్లు పెరగడంతో కొంతమేర నష్టాలను పూడ్చుకుంది. సెన్సెక్స్‌ 0.62 శాతం క్షీణించి 76,469 వద్ద స్థిరపడింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఒక నెల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. విస్తృత మార్కెట్‌లోనూ అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 సూచీ 0.53 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 100 సూచీ 0.37 శాతం నష్టపోయాయి.

పెరుగుతున్న మ‌ధ్య ప్రాచ్య ఉద్రిక్త‌త‌లు..

మార్కెట్ల పతనానికి ప్రధాన కారణాల్లో మధ్యప్రాచ్యంలో పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఒకటిగా నిలిచాయి. ఇరాన్‌, అమెరికా మధ్య ఘర్షణ మరింత తీవ్రతరం కావడం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేసింది. హోర్ముజ్ జ‌ల‌సంధి ప్రాంతంలో ఇరాన్‌ లక్ష్యాలపై అమెరికా సైన్యం తాజాగా దాడులు చేసినట్లు సమాచారం. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ జలమార్గంలో టెహ్రాన్‌ సముద్రపు మైన్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రతీకార చర్యగా ఈ దాడులు చేపట్టినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. అంతకుముందు అమెరికా సైనిక స్థావరంపై జరిగిన దాడికి కూడా ఇది ప్రతిస్పందనగా పేర్కొన్నారు. అమెరికా మిత్రదేశాలపై ఇరాన్‌ బుధవారం తెల్లవారుజామున దాడులు చేసినట్లు కూడా సమాచారం వెలువడింది. నెలకు పైగా కొంత విరామం తర్వాత అమెరికా, ఇరాన్‌ మధ్య పోరాటం మళ్లీ తీవ్రరూపం దాల్చింది. వారాంతంలో అమెరికా సైన్యం హోర్ముజ్‌లోని ఒక ద్వీపంపై ఇరాన్‌కు చెందిన రాకెట్‌ లాంచర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఆ రాకెట్‌ లాంచర్లను ఉపయోగించి జలమార్గంలో మైన్లు ఏర్పాటు చేసేందుకు ఇరాన్‌ సిద్ధమవుతోందని అమెరికా సైన్యం పేర్కొంది.

పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

తాజా పరిణామాలతో ముడి చమురు ధరలపై మరింత ఒత్తిడి పెరిగింది. వ్యూహాత్మకంగా అత్యంత ముఖ్యమైన హోర్ముజ్‌ ద్వారా ఇంధన సరఫరాలకు అంతరాయం కలిగే అవకాశాలపై ఆందోళనలు పెరగడంతో బ్రెంట్‌ క్రూడ్‌ ధర దాదాపు ఆరు వారాల గరిష్ఠ స్థాయికి చేరువలో కొనసాగింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధ‌ర సెష‌న్‌లో ఒక ద‌శ‌లో గ‌రిష్ట స్థాయికి చివ‌రికి బ్యారెల్‌కు 93 డాల‌ర్ల‌కు వ‌చ్చింది. డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 0.54 శాతం త‌గ్గి 90 డాల‌ర్ల‌కు చేరుకుంది. ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి మ‌ళ్లీ బ‌ల‌హీన ప్ర‌ద‌ర్శ‌న చేసింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 94.96 వ‌ద్ద ఉన్న రూపాయి సెష‌న్‌లో 0.02 శాతం మేర న‌ష్ట‌పోయింది.

Advertisement
Advertisement