త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nashik Onion Wastage | నాసిక్‌లో దారుణం: గోదాముల్లో కుళ్లిపోతున్న లక్షల టన్నుల ఉల్లి.. అధికారుల నిర్లక్ష్యమే కారణమా?

మార్కెట్లో ధరల నియంత్రణ కోసం నాసిక్ ప్రభుత్వ గోదాముల్లో నిల్వ ఉంచిన లక్షల టన్నుల ఉల్లి కుళ్లిపోయింది. అధికారుల నిర్లక్ష్యంపై రైతులు మండిపడుతున్నారు.

J

National | Published On Sep 2, 2026, 3.18 pm IST

Nashik Onion Wastage | నాసిక్‌లో దారుణం: గోదాముల్లో కుళ్లిపోతున్న లక్షల టన్నుల ఉల్లి.. అధికారుల నిర్లక్ష్యమే కారణమా?
Advertisement
  • మహారాష్ట్ర నాసిక్‌లోని లాల్‌గావ్ CWC గోదాములో కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్న కోట్ల విలువైన ఉల్లిపాయలు
  • ధరల నియంత్రణ కోసం NAFED, NCCF ద్వారా కొనుగోలు చేసిన 1.20 లక్షల టన్నుల ఉల్లి స్టాక్ వృథా
  • కనీస భద్రతా చర్యలు (మాస్కులు, గ్లౌజులు) లేకుండానే పురుగులు పట్టిన ఉల్లిని తొలగిస్తున్న కార్మికులు
  • ప్రభుత్వ అధికారుల తీవ్ర నిర్లక్ష్యంపై మండిపడుతున్న రైతులు, స్థానిక ప్రజలు

Nashik Onion Wastage | త్రినేత్ర.న్యూస్ : మహారాష్ట్రలోని ఉల్లికి పెట్టింది పేరైన నాసిక్ (Nashik) ప్రాంతంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల దారుణం చోటు చేసుకుంది. లాల్‌గావ్ CWC (Central Warehousing Corporation) గోదాములో అధికారుల నిర్లక్ష్యం కారణంగా కోట్ల రూపాయల విలువైన ఉల్లిపాయలు (Onion Stocks) కుళ్లిపోయి దారుణమైన దుర్వాసన వెదజల్లుతున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో లక్షల టన్నుల ప్రజాధనం కళ్లెదుటే మట్టిపాలవుతోంది.

ధరల నియంత్రణ కోసం కొని.. వృథా చేసి

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరగకుండా కంట్రోల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన NAFED, NCCF రంగంలోకి దిగి భారీగా కొనుగోళ్లు చేపట్టాయి. ఇలా సేకరించిన సుమారు 1.20 లక్షల టన్నుల ఉల్లిని లాల్‌గావ్ గోదాముల్లో నిల్వ చేశారు. అయితే, ఆ స్టాక్ నిర్వహణలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. వాతావరణ పరిస్థితులు, సరైన గాలి వెలుతురు లేకపోవడంతో ఉల్లిపాయలన్నీ కుళ్ళిపోయి ఎందుకూ పనికిరాకుండా పోయాయి.

కార్మికుల ప్రాణాలతో చెలగాటం

కుళ్లిపోయి, పురుగులు పట్టిన ఉల్లిపాయలను క్లియర్ చేయడానికి అధికారులు కార్మికులను వినియోగిస్తున్నారు. అయితే, ఘాటైన దుర్వాసన, పురుగులు ఉన్నప్పటికీ వారికి కనీస సేఫ్టీ కిట్స్ (మాస్కులు, గ్లౌజులు) ఇవ్వకుండానే పనులు చేయిస్తుండటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

ఒకపక్క కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు కన్నీరు పెడుతుంటే.. మరోపక్క ఇలా ప్రభుత్వ గోదాముల్లో కోట్ల విలువైన పంట కళ్లెదుటే వృథా కావడంపై స్థానికులు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులైన అధికారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement