ECLGS | MSME లకు గుడ్ న్యూస్.. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ ఇవ్వనున్న కేంద్రం..
ECLGS | పశ్చిమ ఆసియా సంక్షోభం ప్రభావంతో నష్టపోయిన వ్యాపారాలను, ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలను (MSMEs) ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2.50 లక్షల కోట్ల క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
ECLGS | పశ్చిమ ఆసియా సంక్షోభం ప్రభావంతో నష్టపోయిన వ్యాపారాలను, ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలను (MSMEs) ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2.50 లక్షల కోట్ల క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద అమెరికా-ఇరాన్ ఘర్షణ కారణంగా రుణగ్రహీతలు డిఫాల్ట్ అయిన సందర్భంలో రూ.100 కోట్ల వరకు రుణాలపై సుమారు 90 శాతం క్రెడిట్ గ్యారంటీని రుణదాతలకు అందించనున్నారు. బ్యాంకు రుణాలకు ఈ గ్యారంటీని ప్రభుత్వానికి చెందిన పూర్తిస్థాయి అనుబంధ సంస్థ నేషనల్ క్రెడిట్గ్యారంటీ ట్రస్టీ కంపెనీ అందించనుంది. ఈ పథకానికి ప్రభుత్వం సుమారు రూ.17వేల కోట్ల నుంచి రూ.18వేల కోట్ల వరకు నిధులు సమకూర్చాల్సి ఉంటుంది.
కోవిడ్ సమయంలో భారీ ఊరట..
ఈ పథకం కోవిడ్-19 మహమ్మారి సమయంలో భారీ విజయాన్ని సాధించింది. అనేక రంగాల్లోని వ్యాపారాలు నిలదొక్కుకోవడానికి, తమ బకాయిలను తీర్చడానికి ఇది కీలకంగా ఉపయోగపడింది. 2020 మేలో ప్రభుత్వం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ (ECLGS) ను ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా ప్రకటించింది. కోవిడ్-19 కారణంగా ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో అర్హత కలిగిన MSMEs , ఇతర వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాల బాధ్యతలను నిర్వహించేందుకు, తిరిగి వ్యాపారాలను ప్రారంభించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. ECLGS ద్వారా ఆర్థిక వ్యవస్థలో దాదాపు అన్ని రంగాలు కవరయ్యాయి. ఈ పథకం కింద రుణాలను అందించిన సభ్య రుణ సంస్థలకు (MLIs) 100 శాతం గ్యారంటీని ఇచ్చారు.
రుణాలు సులభంగా అందుబాటులోకి..
ఈ పథకం నిర్మాణం కారణంగా రుణాలు సులభంగా అందుబాటులోకి వచ్చాయి. రుణగ్రహీతల ప్రస్తుత రుణ స్థితిని ఆధారంగా తీసుకుని ముందుగానే ఆమోదించబడిన రుణాలను అందించడంతో కొత్తగా అంచనాలు అవసరం లేకుండా అదనపు క్రెడిట్ ను మంజూరు చేశారు. అలాగే రుణాలపై వడ్డీ రేట్లను పరిమితం చేసి క్రెడిట్ ఖర్చును తగ్గించారు. ప్రాసెసింగ్ ఫీజులు, ముందస్తు చెల్లింపు ఛార్జీలు, గ్యారంటీ ఫీజులు లేకుండా రుణాలను మంజూరు చేశారు. ఈ పథకం 2023 మార్చి 31 వరకు కొనసాగింది. కాగా సాధారణ ప్రజలపై భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఇటీవలి కాలంలో పలు చర్యలు తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం అందులో ముఖ్యమైనది. భారత్ డీజిల్, పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతోపాటు కీలక పెట్రోకెమికల్ ఉత్పత్తులపై ప్రత్యేక మినహాయింపులు ఇచ్చింది. అలాగే ప్రత్యేక ఆర్థిక మండలాలు (SEZs) దేశీయ టారిఫ్ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతులు కల్పించింది.
ప్రజల రక్షణకు చర్యలు..
మార్చి 26న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ.10 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులను రక్షించేందుకు ఈ చర్య తీసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న ఇరాన్పై సైనిక దాడులు ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచ ముడి చమురు ధరలు దాదాపు 50 శాతం పెరిగాయి. దీనికి ప్రతిగా టెహ్రాన్ తీవ్ర ప్రతీకార దాడులు చేపట్టింది. కాగా ప్రభుత్వం డీజిల్పై లీటర్కు రూ.21.50, విమాన ఇంధనం (ATF)పై రూ.29.50 ఎగుమతి సుంకాన్ని విధించింది. పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీని లీటర్కు రూ.3కు తగ్గించగా, డీజిల్పై ప్రస్తుతం అది శూన్యంగా ఉంది. ఏప్రిల్ 2న పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా షిప్పింగ్ మార్గాలు దెబ్బతిన్న నేపథ్యంలో సరఫరా స్థిరత్వాన్ని కొనసాగించేందుకు కీలక పెట్రోకెమికల్ ఉత్పత్తుల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చింది. ముడి చమురుతో పాటు భారత్ ఎరువులు, సహజ వాయువు దిగుమతుల్లో కూడా ప్రధాన దేశంగా కొనసాగుతోంది. అయితే ECLGS పై కేంద్రం ఒక ప్రకటనను విడుదల చేస్తుందని తెలుస్తోంది.
సంబంధిత వార్తలు

HDFC Bank | హెచ్డీఎఫ్సీ బ్యాంకులో లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్.. తగ్గిన వడ్డీ రేట్లు..
మే 8, 2026

Home Loan | హోం లోన్ తీసుకుంటున్నారా.. బెస్ట్ డీల్ లభించాలంటే క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలి..?
మే 3, 2026

New Online Gaming Rules 2026 | కొత్త ఆన్లైన్ గేమింగ్ రూల్స్ అమల్లోకి.. ఉల్లంఘిస్తే రూ.1 కోటి ఫైన్, 3 ఏళ్ల జైలు శిక్ష..
మే 1, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



