త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India – Brazil Win – Win Partnership | భారత్, బ్రెజిల్ మధ్య రూ.1.8 లక్షల కోట్ల వాణిజ్య ఒప్పందం

భారత్, బ్రెజిల్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ, రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 20 బిలియన్ డాలర్లకు పెంచాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇది ఇరు దేశాలకు మేలు చేసే 'విన్-విన్' భాగస్వామ్యం అని ఆయన అభివర్ణించారు.

J

Business | Published On Feb 21, 2026, 5.05 pm IST

India – Brazil Win – Win Partnership | భారత్, బ్రెజిల్ మధ్య రూ.1.8 లక్షల కోట్ల వాణిజ్య ఒప్పందం
Advertisement
  • భారత్-బ్రెజిల్ మైత్రిలో కొత్త అధ్యాయం
  • 20 బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యంతో ప్రధాని మోదీ సరికొత్త ప్రణాళిక
  • గాంధీనే నాకు రోల్ మోడల్ : బ్రెజిల్ ప్రెసిడెంట్

India - Brazil Win - Win Partnership | త్రినేత్ర.న్యూస్ : భారత్, బ్రెజిల్ మధ్య సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని వచ్చే ఐదేళ్లలో 20 బిలియన్ డాలర్ల (సుమారు 1.8 లక్షల కోట్లు) స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. న్యూఢిల్లీలో బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇన్సియో లులా ద సిల్వాతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈసందర్భంగా వచ్చే ఐదేళ్లలో భారత్, బ్రెజిల్ మధ్య 20 బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యంతో ముందుకెళ్లనున్నట్లు మోదీ ప్రకటించారు. ఈ భాగస్వామ్యాన్ని ఇరు దేశాలకు ప్రయోజనకరమైన "విన్-విన్ పార్టనర్‌షిప్" (Win-Win Partnership) గా మోదీ అభివర్ణించారు.

నిలకడగా ఇరు దేశాల వాణిజ్యం

శనివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారత్-బ్రెజిల్ మధ్య ఆర్థిక సహకారం కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా, వ్యూహాత్మక బలాన్ని కూడా పెంచుతుందని పేర్కొన్నారు. గడిచిన కొద్ది కాలంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిలకడగా పెరుగుతోందని, అయితే దీన్ని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏయే రంగాల్లో సహకారం?

బ్రెజిల్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, ఎనర్జీ రంగాల్లో సహకారం పెంచుకోవడం, డిజిటల్ పేమెంట్స్ (UPI వంటివి), ఐటీ రంగాల్లో పరస్పర మార్పిడి, రక్షణ, అంతరిక్ష పరిశోధనల్లో కలిసి పనిచేయడం ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేయనున్నారు.

ప్రెసిడెంట్ లూలా స్పందన

బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ద సిల్వా కూడా భారత్‌తో సంబంధాల పట్ల సానుకూలంగా స్పందించారు. గ్లోబల్ సౌత్ (Global South) దేశాలుగా భారత్, బ్రెజిల్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు. మహాత్మా గాంధీ తనకు రోల్ మోడల్ అని, భారత్ అనుసరిస్తున్న శాంతియుత, అభివృద్ధి బాట తమకు స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.

వచ్చే ఐదేళ్లలో ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇరు దేశాల వాణిజ్య మంత్రులు, పారిశ్రామికవేత్తలతో కూడిన ప్రత్యేక కార్యాచరణ బృందాలు పనిచేయనున్నాయి. ఈ ఒప్పందాలు భారత్ నుంచి ఎగుమతులు పెరగడానికి, దేశీయ ఉద్యోగ అవకాశాల కల్పనకు దోహదపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement