Crude Oil Prices | యుద్ధం ఎఫెక్ట్.. ముడి చమురు ధరలు పైపైకి..
Crude Oil Prices | ఇరాన్తో యుద్ధ ఉద్రిక్తతలు హోర్ముజ్ జలసంధి ద్వారా ట్యాంకర్ రాకపోకలను దెబ్బతీయడంతో గత నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చమురు ధరలు చేరుకున్నాయి. బ్రెంట్ క్రూడ్ 13 శాతం పెరిగి బ్యారెల్కు 82 డాలర్లకు పైగా ట్రేడ్ అయ్యింది. ఇది జనవరి 2025 తర్వాత అత్యధికం కావడం గమనార్హం.
Crude Oil Prices | ఇరాన్తో యుద్ధ ఉద్రిక్తతలు హోర్ముజ్ జలసంధి ద్వారా ట్యాంకర్ రాకపోకలను దెబ్బతీయడంతో గత నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చమురు ధరలు చేరుకున్నాయి. బ్రెంట్ క్రూడ్ 13 శాతం పెరిగి బ్యారెల్కు 82 డాలర్లకు పైగా ట్రేడ్ అయ్యింది. ఇది జనవరి 2025 తర్వాత అత్యధికం కావడం గమనార్హం. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ధర సుమారు 72 డాలర్ల వద్ద నిలిచింది. విస్తరిస్తున్న యుద్ధం నేపథ్యంలో నౌకల యజమానులు, ట్రేడర్లు స్వచ్ఛందంగా ట్యాంకర్ల రవాణాను నిలిపివేయడంతో హోర్ముజ్ జలసంధి గుండా చమురు సరఫరా దాదాపు ఆగిపోయింది. దీంతో చమురు ధరలు భారీగా పెరిగాయి.
ఆయిల్ ట్యాంకర్లపై దాడులు..
ఇరాన్ తీరానికి సమీపంలో ఉన్న హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఐదవ వంతు రవాణా మార్గంగా ఉంది. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) కూడా గణనీయంగా ఈ మార్గం గుండా సరఫరా అవుతుంది. అత్యంత ఇరుకుగా ఉండే ఈ జలమార్గంలో ఏ అంతరాయం వచ్చినా గ్లోబల్ మార్కెట్లపై తక్షణ ప్రభావం చూపుతుంది. ఇరాన్ అధికారులు జలసంధి తెరిచే ఉందని ప్రకటించినప్పటికీ మూడు ఆయిల్ ట్యాంకర్లపై దాడులు జరిగినట్లు ధ్రువీకరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పోస్టులో అమెరికా దళాలు ఇరాన్కు చెందిన తొమ్మిది నౌకలను ముంచేశాయని, లక్ష్యాలు సాధించే వరకు సైనిక చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
2.06 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తి పెంపుకు అంగీకారం..
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త క్షిపణి దాడులు ఇరాన్లోని లక్ష్యాలపై జరగ్గా ఇరాన్ ప్రతిదాడులు ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలు, అలాగే సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, కువైట్, బహ్రెయిన్ వంటి దేశాలపై జరిగాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఈ దాడుల్లో మరణించారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో గ్లోబల్ క్రూడ్ మార్కెట్ అనిశ్చితిలోకి వెళ్లింది. మరోవైపు ఓపెక్ ముందుగా షెడ్యూల్ చేసిన సమావేశంలో వచ్చే నెల నుంచి రోజుకు 2.06 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తి పెంపును అంగీకరించింది. ఈ కూటమిలో ఇరాన్, సౌదీ అరేబియా, రష్యా వంటి దేశాలు ఉన్నాయి. అయితే హోర్ముజ్ గుండా రవాణా ఆగిపోతే అదనపు ఉత్పత్తి కూడా మార్కెట్లకు చేరుకోవడం కష్టమవుతుంది.
ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం..
ఇరాన్ రోజుకు సుమారు 3.3 మిలియన్ బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తోంది. ఇది ప్రపంచ సరఫరాలో సుమారు 3 శాతంగా ఉంది. అయితే జలసంధి పక్కన ఉన్న భౌగోళిక స్థానం కారణంగా పర్షియన్ గల్ఫ్ నుంచి చైనా, భారత్, జపాన్ వంటి ప్రధాన మార్కెట్లకు వెళ్లే సరఫరాలపై ఇరాన్కు వ్యూహాత్మక ప్రభావం ఉంది. చమురు ధరలు స్థిరంగా పెరిగితే గ్లోబల్ ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరగవచ్చు. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వంటి కేంద్ర బ్యాంకులు ధర స్థిరత్వం, ఆర్థిక వృద్ధి మధ్య సమతుల్యత సాధించడం క్లిష్టమవుతుంది. రిటైల్ పెట్రోల్ ధరలు పెరగడం అమెరికాలో రాజకీయంగా సున్నితమైన అంశం. దీనికి ప్రత్యామ్నాయంగా వాషింగ్టన్ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల నుంచి చమురు విడుదల చేసే అవకాశాన్ని పరిశీలించవచ్చు. ఫిబ్రవరి 20 నాటికి ఈ నిల్వల్లో సుమారు 415 మిలియన్ బ్యారెళ్లు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లు జలసంధిలో రవాణా పునరుద్ధరణ, సైనిక చర్యల దిశ, ఓపెక్ ఉత్పత్తి పెంపు ప్రభావంపై దృష్టి సారించాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






