త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Apple | పాకిస్థాన్‌లో ఐఫోన్ల‌ను త‌యారు చేయ‌నున్న యాపిల్‌..?

Apple | అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ పాకిస్థాన్‌లో ఐఫోన్‌ల తయారీకి అడుగులు వేస్తోంది. ఇందుకు పాక్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్రేమ్‌వర్క్ లో యాపిల్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడానికి అంగీకరించిందని పాకిస్థాన్ మీడియా వెల్లడించింది.

S

Business | Published On Feb 20, 2026, 11.16 am IST

Apple | పాకిస్థాన్‌లో ఐఫోన్ల‌ను త‌యారు చేయ‌నున్న యాపిల్‌..?
Advertisement

Apple | అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ పాకిస్థాన్‌లో ఐఫోన్‌ల తయారీకి అడుగులు వేస్తోంది. ఇందుకు పాక్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్రేమ్‌వర్క్ లో యాపిల్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడానికి అంగీకరించిందని పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. ఈ విధానం కింద పాకిస్థాన్‌లో ఐఫోన్‌లను తయారు చేయడంతోపాటు రీఫర్బిష్డ్ ఐఫోన్‌లను మరమ్మత్తు చేసి తిరిగి ఎగుమతి చేయడానికి యాపిల్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. తొలి ఏడాదిలోనే రీఫర్బిష్డ్ ఐఫోన్‌ల ఎగుమతుల ద్వారా 100 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చే అవకాశముందని పాక్ ప్రభుత్వం అంచనా వేస్తోంది.

పాక్‌కు యాపిల్ కంపెనీ ష‌ర‌తులు..

ఈ సంద‌ర్భంగా యాపిల్ యాజమాన్యం కొన్ని కీలక షరతులను పాక్ ప్రభుత్వానికి తెలియజేసిందని పాక్‌ ఇంజినీరింగ్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈవో హమద్ అలీ మంసూర్ తెలిపారు. తక్కువ ధరకు భూమి కేటాయింపు, 8 శాతం పనితీరు ప్రోత్సాహకం, రెండు నుంచి మూడు సంవత్సరాల పాత ఐఫోన్‌ల రిపేర్ యూనిట్ల ఏర్పాటు వంటి ప్రతిపాదనలను ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆమోదానికి పంపినట్లు ఆయన తెలిపారు. కాగా యాపిల్ గతంలో ఇండోనేసియా, మలేషియా, భారత్‌లలో ఇదే విధానాన్ని అమలు చేసిందని మంసూర్ తెలిపారు. తొలుత రిపేర్ యూనిట్లతో స్థానిక మానవ వనరులకు శిక్షణ ఇచ్చి, అనంతరం పూర్తి స్థాయి తయారీకి యాపిల్ వెళ్లిందని గుర్తు చేశారు.

చైనా కంపెనీల‌ ద్వారా కూడా పెట్టుబ‌డులు..

ప్రస్తుతం పాకిస్థాన్‌లో మొబైల్ తయారీదారులకు ప్రభుత్వం 6 శాతం ప్రోత్సాహకం ఇస్తుండగా, యాపిల్‌ను ఆకర్షించేందుకు దానిని 8 శాతానికి పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ కొత్త విధానం ద్వారా చైనా కంపెనీల నుంచి కూడా 557 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశముందని పాక్ ప్ర‌భుత్వం అంచనా వేసింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ చైనా పర్యటన సందర్భంగా ఈ మేరకు అవగాహన ఒప్పందాలు కుదిరినట్లు తెలిపారు. ప్రస్తుతం మొబైల్ తయారీలో కేవలం 12 శాతం లోకలైజేషన్ మాత్రమే ఉందని, తొలి ఏడాదిలోనే దాన్ని 35 శాతానికి, తరువాత 50 శాతానికి పెంచేందుకు కంపెనీలు హామీ ఇచ్చాయని మంసూర్ చెప్పారు. భవిష్యత్తులో ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌లు, వాచ్‌లు, ట్రాకర్లు, ఇయ‌ర్‌బడ్స్ తయారీకి కూడా పెట్టుబడులు రానున్నాయని తెలిపారు.

Advertisement
Advertisement