Tariff Refund | అమెరికా టారిఫ్ రీఫండ్ షురూ.. భారత్కు రావల్సిందెంత..?
Tariff Refund | ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లను అక్కడి సుప్రీం కోర్టు రద్దు చేయడమే కాక వసూలు చేసిన మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించిన నేపథ్యంలో టారిఫ్ రీఫండ్ ప్రక్రియను అమెరికా ప్రారంభించింది.
Tariff Refund | ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లను అక్కడి సుప్రీం కోర్టు రద్దు చేయడమే కాక వసూలు చేసిన మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించిన నేపథ్యంలో టారిఫ్ రీఫండ్ ప్రక్రియను అమెరికా ప్రారంభించింది. మొత్తం టారిఫ్ వసూళ్లు 166 బిలియన్ డాలర్ల మేర ఉండగా, అందులో భారత్ నుంచి వసూలు చేసిన టారిఫ్ల మొత్తం సుమారుగా 10 నుంచి 12 బిలియన్ డాలర్లకు వరకు ఉంటుందని తెలుస్తోంది. అయితే భారత్ ఆ మొత్తాన్ని నేరుగా పొందే అవకాశం లేదు. అమెరికా కొనుగోలుదారులతో చర్చలు జరిపితేనే ఆ మొత్తాన్ని భారత ఎగుమతిదారులు పొందే అవకాశాలు ఉంటాయి.
అమెరికా కొనుగోలుదారులతో చర్చలు జరపాల్సిందే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేసిన ట్రేడ్ పాలసీలో భాగంగా విధించిన కొన్ని టారిఫ్లు చెల్లవని కోర్టు తేల్చిన తర్వాత, ఏప్రిల్ 20 నుంచి రీఫండ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఈ క్లెయిమ్లను కేవలం అమెరికాలోని దిగుమతిదారులే దాఖలు చేయగలుగుతారు. దీంతో భారత ఎగుమతిదారులకు నేరుగా రీఫండ్ పొందే చట్టపరమైన మార్గం లేదు. ఈ పరిస్థితిలో భారత కంపెనీలు తమ అమెరికా కొనుగోలుదారులతో చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. రీఫండ్లో వాటా పొందాలంటే రిబేట్ షేరింగ్ ఒప్పందాలు, ధరల మార్పులు లేదా భవిష్యత్ ఒప్పందాల్లో మెరుగైన షరతులు కోరాల్సి ఉంటుంది. ఈ రీఫండ్లలో ప్రధానంగా టెక్స్ టైల్స్, అప్పారెల్, ఇంజినీరింగ్ గూడ్స్, కెమికల్స్ రంగాలకు ఎక్కువ భాగం దక్కే అవకాశం ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ నివేదిక పేర్కొంది. ఈ రంగాలపై గతంలో విధించిన టారిఫ్ల ప్రభావం ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం. అయితే ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవడం భారత ఎగుమతిదారుల చర్చా సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది.
రీఫండ్కు 60 నుంచి 90 రోజులు..
రీఫండ్ ప్రక్రియను అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ నిర్వహిస్తోంది. దీనిలో కన్సాలిడేటెడ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ ఎంట్రీస్ (CAPE) అనే సిస్టమ్ను ఉపయోగిస్తున్నారు. మొదటి దశలో ఇంకా కస్టమ్స్ సమీక్షలో ఉన్న లేదా గత 80 రోజుల్లో ఫైనలైజ్ అయిన ఎంట్రీస్కు సంబంధించిన క్లెయిమ్లను పరిశీలిస్తున్నారు. అమెరికా కస్టమ్స్ అధికారులు ఇప్పటికే మొదటి దశకు అర్హత ఉన్న వ్యాపారాలకు సుమారు 127 బిలియన్ డాలర్ల రీఫండ్లు ఇవ్వాల్సి ఉందని ఫెడరల్ కోర్టుకు తెలిపారు. పాత ఎంట్రీస్కు సంబంధించిన క్లెయిమ్ల కోసం వ్యాపారాలు తరువాతి దశలలో ఎదురుచూడాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ సులభంగా పూర్తయ్యేలా కనిపించడం లేదు. అమెరికాలోని దిగుమతిదారులు తమ క్లెయిమ్లను CAPE పోర్టల్ ద్వారా దాఖలు చేయాలి. ఇందులో కస్టమ్స్ రికార్డులు, టారిఫ్ చెల్లింపుల వివరాలు, ఎంట్రీ క్లాసిఫికేషన్ వంటి పత్రాలు అవసరం అవుతాయి. మొత్తం 53 మిలియన్ల ఎంట్రీస్ను 3.3 లక్షల ఇంపోర్టర్లు దాఖలు చేసినందున ప్రక్రియ క్లిష్టంగా మారింది. క్లెయిమ్ ఆమోదం పొందిన తర్వాత కూడా రీఫండ్ చెల్లింపులు 60 నుంచి 90 రోజుల వరకు పట్టే అవకాశం ఉంది.
ఇటీవల అమెరికా ప్రభుత్వం ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1974 సెక్షన్ 122 కింద కొత్త టారిఫ్లను అమలు చేస్తున్నప్పటికీ, కోర్టు తీర్పు కారణంగా పాత టారిఫ్ వసూళ్లను చట్టబద్ధం చేయలేకపోయింది. దీంతో ఈ రీఫండ్ ప్రక్రియ ప్రారంభమైంది. కాగా ఈ పరిణామం భారత ఎగుమతిదారులకు ఒక పెద్ద అవకాశాన్ని అందిస్తున్నప్పటికీ, దాని లాభం పూర్తిగా పొందాలంటే అమెరికా భాగస్వాములతో చర్చలు కీలకంగా మారనున్నాయి.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






