త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | ఖ‌మేనీ మృతితో.. స్టాక్ మార్కెట్ల‌పై నెగెటివ్ ప్ర‌భావం లేన‌ట్లే..?

Stock Markets | అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై వైమానిక దాడులను ప్రారంభించాయ‌న్న వార్త‌ల‌తో పెట్టుబ‌డిదారులు, పారిశ్రామిక వ‌ర్గాల్లో ఒక్క‌సారిగా ఆందోళ‌న మొద‌లైంది. గ‌త వారం రోజుల నుంచి మార్కెట్లు ప‌త‌నం అవుతూనే ఉండ‌గా తాజా యుద్ధంతో మార్కెట్ మ‌రింత ప‌త‌నం అవుతుంద‌ని అంద‌రూ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

S

Business | Published On Mar 1, 2026, 11.06 am IST

Stock Markets | ఖ‌మేనీ మృతితో.. స్టాక్ మార్కెట్ల‌పై నెగెటివ్ ప్ర‌భావం లేన‌ట్లే..?
Advertisement

Stock Markets | అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై వైమానిక దాడులను ప్రారంభించాయ‌న్న వార్త‌ల‌తో పెట్టుబ‌డిదారులు, పారిశ్రామిక వ‌ర్గాల్లో ఒక్క‌సారిగా ఆందోళ‌న మొద‌లైంది. గ‌త వారం రోజుల నుంచి మార్కెట్లు ప‌త‌నం అవుతూనే ఉండ‌గా తాజా యుద్ధంతో మార్కెట్ మ‌రింత ప‌త‌నం అవుతుంద‌ని అంద‌రూ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. సోమ‌వారం నాడు మార్కెట్ల‌లో భారీ స్థాయి ప‌త‌నాన్ని చూసే అవ‌కాశం ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. కానీ ఇరాన్ సుప్రీం లీడ‌ర్ ఖ‌మేనీ మృతితో యుద్ధం ఆగిపోయిన‌ట్లేన‌ని, మార్కెట్ల‌పై నెగెటివ్ ప్ర‌భావం అంత‌గా ఉండ‌ద‌ని విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

భారీ స్థాయిలో ప‌త‌నం లేన‌ట్లే..?

ఖ‌మేనీ మృతి చెంద‌డం మార్కెట్ల‌కు పాజిటివ్ వార్తే అని విశ్లేష‌కులు చెబుతున్నారు. అంత‌కు ముందు భారీ స్థాయిలో క్రాష్ త‌ప్ప‌ద‌ని భావించిన‌ప్ప‌టికీ ఖ‌మేనీ మృతి వార్త‌తో మార్కెట్ల‌పై కాస్త పాజిటివ్ ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. సోమ‌వారం ట్రేడింగ్ సెష‌న్‌లో మార్కెట్లు అంత‌టి గ‌ణ‌నీయమైన స్థాయిలో ప‌త‌నం అయ్యే అవ‌కాశాలు లేవ‌ని చెబుతున్నారు. అయితే ఇప్ప‌టికిప్పుడు యుద్ధం ఆగ‌క‌పోయినా ప్ర‌స్తుతం వ‌స్తున్న‌వి పాజిటివ్ వార్త‌లే క‌నుక మార్కెట్లు వ‌చ్చే వారంలో పుంజుకున్నా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేద‌ని అంటున్నారు. ఇరాన్‌లో స‌మ‌స్య‌లు ఇక వేగంగా ప‌రిష్కారం అవుతాయ‌ని దీంతో మార్కెట్లు మ‌ళ్లీ పాజిటివ్‌లోకి వ‌స్తాయ‌ని విశ్లేషిస్తున్నారు. అందువ‌ల్ల పెట్టుబ‌డిదారుల‌కు స్టాక్ మార్కెట్ల‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఇది స‌రైన స‌మ‌యంగా చెబుతున్నారు.

2-3 శాతం మేర మాత్ర‌మే..?

అయితే యుద్ధం పూర్తిగా ముగిసింద‌న్న వార్త‌లు రావ‌డం లేదు కానీ ఇప్ప‌టికైతే మార్కెట్లు బుల్ ర‌న్ కొన‌సాగించ‌కపోయినా న‌ష్టం మాత్రం భారీ ఎత్తున ఉండ‌ద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. అంత‌కు ముందు 10 శాతం ప‌త‌నాన్ని అంచ‌నా వేయ‌గా, ఇప్పుడ‌ది 2-3 శాతం మేర ఉంటుంద‌ని అంచనా వేస్తున్న‌ట్లు తెలిపారు. అయిన‌ప్ప‌టికీ మార్కెట్లు వేగంగా పుంజుకుని బుల్ ర‌న్ ను కొన‌సాగించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి ముడి చ‌మురు ధ‌ర‌లు పెరుగుతాయ‌ని, ఇది తాత్కాలిక‌మేన‌ని, కొన్ని రోజులకు అంతా స‌ర్దుకుంటుంద‌ని తెలిపారు. మార్కెట్లు దీర్ఘ‌కాలంలో బుల్ ర‌న్ సిగ్న‌ల్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయ‌ని, దేశీయ స్టాక్ మార్కెట్లలో ర్యాలీ కొన‌సాగడం ఖాయ‌మ‌ని చెప్పారు. ఉద్రిక్త‌త‌లు కాస్త త‌గ్గే అవ‌కాశం ఉంది క‌నుక ద్ర‌వ్యోల్బ‌ణం కూడా పెద్ద‌గా పెరిగే అవ‌కాశం లేద‌ని తెలిపారు. విదేశీ సంస్థాగ‌త పెట్టుబ‌డిదారులు కూడా మ‌ళ్లీ భార‌త మార్కెట్ల‌లోకి వ‌స్తార‌ని అన్నారు.

Advertisement
Advertisement