త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijayashanthi on Shabad Murder Case | షాబాద్ నరమేధానికి పోలీసుల లంచమే కారణమా? మహిళా భద్రతపై విజయశాంతి సంచలన కామెంట్స్!

షాబాద్‌లో ఆరుగురిని బలితీసుకున్న నరమేధం వెనుక పోలీసుల లంచం, నిర్లక్ష్యం ఉందన్న వార్తలపై కాంగ్రెస్ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

J

Telangana | Published On Jul 13, 2026, 10.12 pm IST

Vijayashanthi on Shabad Murder Case | షాబాద్ నరమేధానికి పోలీసుల లంచమే కారణమా? మహిళా భద్రతపై విజయశాంతి సంచలన కామెంట్స్!
Advertisement
  • షాబాద్‌లో ఆరుగురిని హత్య చేసిన నరమేధం కేసుపై ఎక్స్ వేదికగా స్పందించిన విజయశాంతి
  • పోక్సో (POCSO) కేసులో నిందితుడు రాజ్‌కుమార్‌కు బెయిల్ రావడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆవేదన
  • పోలీసులు లంచం తీసుకుని నిందితుడికి సహకరించారన్న వార్తలపై తీవ్ర విమర్శలు
  • కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళల భద్రత, శాంతిభద్రతలపై మరింత కఠినంగా వ్యవహరించాలని ఆమె డిమాండ్

Vijayashanthi on Shabad Murder Case | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో (Telangana) సంచలనం రేపిన షాబాద్ (Shabad) నరమేధం వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చీఫ్ కో-ఆర్డినేటర్, ఫైర్ బ్రాండ్ విజయశాంతి (Vijayashanti) తీవ్ర స్థాయిలో స్పందించారు. ఒక క్రిమినల్ ఏకంగా ఆరుగురిని దారుణంగా హత్య చేయడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

అసలేం జరిగింది?

పోక్సో (POCSO) కేసులో అరెస్ట్ అయిన నిందితుడు రాజ్ కుమార్.. జైలు నుంచి బెయిల్ (Bail) పై బయటకు వచ్చి ఏకంగా ఆరుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో చివరకు ఆ హంతకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య (Suicide) చేసుకోవడంతో ఈ కేసు ముగిసినట్లు డిపార్ట్‌మెంట్ భావిస్తోంది. కానీ, అసలు నిందితుడు జైలు నుంచి ఎలా బయటకు వచ్చాడన్నదే ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీసింది.

లంచం తీసుకుని వదిలేశారా?

పోక్సో లాంటి తీవ్రమైన కేసులో ఉన్న రాజ్ కుమార్ కు బెయిల్ రావడానికి పోలీసుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని విజయశాంతి ఆరోపించారు. నిందితుడి వద్ద భారీగా లంచం (Bribe) తీసుకుని పోలీసులు అతడి విడుదలకు సహకరించారన్న వార్తలు పత్రికల్లో చూసి తెలంగాణ మహిళా లోకం షాక్ కు గురవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థ చేసిన తప్పు వల్లే ఇప్పుడు ఆరుగురు అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయన్నారు.

ఉమెన్ సేఫ్టీపై అనుమానాలు..

పోలీసు శాఖలో (Police department) ఇలాంటి లోపాల వల్ల రాష్ట్రంలో ఉమెన్ సేఫ్టీ (Women safety) పై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు అత్యధిక ప్రాధాన్యమిస్తామని చెబుతున్న కాంగ్రెస్ పాలనలో (Congress rule) ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకోవాలని కోరారు. ఓ బాధ్యతాయుతమైన మహిళా ప్రజాప్రతినిధిగా, రాష్ట్రంలో శాంతిభద్రతల (Law and order) విషయంలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని ఆమె డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement