త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మ‌ర‌ణం

Road Accident | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖ‌ప‌ట్నంలో (Visakhapatnam) ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జ‌రిగింది. ఆదివారం తెల్ల‌వారుజామున‌ ఆనందపురం - అనకాపల్లి జాతీయ రహదారి గండిగుండం సమీపంలో ఓ లారీని కారు ఢీకొట్టింది.

G

Andhra pradesh | Published On Jul 19, 2026, 8.50 am IST

Road Accident | లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మ‌ర‌ణం
Advertisement

Road Accident | త్రినేత్ర‌.న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖ‌ప‌ట్నంలో (Visakhapatnam) ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జ‌రిగింది. ఆదివారం తెల్ల‌వారుజామున‌ ఆనందపురం - అనకాపల్లి జాతీయ రహదారి గండిగుండం సమీపంలో ఓ లారీని కారు ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. పల్నాడు జిల్లా వినుకొండ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు ఓ కుటుంబం కారులో వెళ్తున్న‌ది. ఈ క్రమంలో కారు ఆనందపురం సమీపంలోని గండిగుండం వద్దకు రాగానే అదుపుతప్పి లారీని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురిలో డ్రైవర్‌ సహా నలుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. నరసరాపుపేట ఎమ్మెల్యే పీఏ చంద్రశేఖర్‌ తీవ్రంగా గాయపడ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుడిని విశాఖలోని ఓ ప్రైవేటు ద‌వాఖాన‌కు తరలించారు. మృతుల్లో చంద్రశేఖర్‌ కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తున్న‌ది. ప్ర‌మాదం ధాటికి కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తుచేస్తున్నారు.

Advertisement
Advertisement