Bill Gates Andhra Pradesh visit | ఏపీలో ‘టెక్ దిగ్గజం’ బిల్ గేట్స్ పర్యటన.. చంద్రబాబుతో భేటీ.. ఆ టెక్నాలజీ చూసి ఫిదా..!
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అమరావతిలో పర్యటించారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్లతో భేటీ అయి.. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యలో టెక్నాలజీ వినియోగంపై చర్చించారు. ఉండవల్లిలో డ్రోన్లతో సాగును పరిశీలించారు.
Andhra pradesh | Published On Feb 16, 2026, 10.30 pm IST
Bill Gates Andhra Pradesh visit | మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కో-చైర్మన్ బిల్ గేట్స్ (Bill Gates) సోమవారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. అమరావతికి చేరుకున్న ఆయనకు గన్నవరం విమానాశ్రయంలో ఆ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో బిల్ గేట్స్ సమావేశమయ్యారు.
చర్చకు వచ్చిన కీలక అంశాలు
ఈ భేటీలో ప్రధానంగా వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో సాంకేతికత వినియోగంపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు 'స్వర్ణాంధ్ర-2047' విజన్ను బిల్ గేట్స్కు వివరించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం రూపొందించిన ప్రణాళికలను గేట్స్ ఆసక్తిగా తిలకించారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శించారు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీని వాడుతున్న తీరును, డేటా విశ్లేషణ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్న విధానాన్ని చూసి ఆయన ప్రశంసలు కురిపించారు. కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న 'సంజీవని' (Sanjeevani) డిజిటల్ హెల్త్ రికార్డుల ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు గేట్స్ ఫౌండేషన్ సహకారం అందించాలని ప్రభుత్వం కోరింది. దీనిపై గేట్స్ సానుకూలంగా స్పందించారు.
పొలాల్లోకి బిల్ గేట్స్
సచివాలయంలో సమావేశం అనంతరం, బిల్ గేట్స్ ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. అక్కడ వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం, ఏఐ (Artificial Intelligence) ఆధారిత సాగు పద్ధతులను ఆయన స్వయంగా పరిశీలించారు. రైతులతో ముచ్చటించి, టెక్నాలజీ వారి జీవితాల్లో తెస్తున్న మార్పులను అడిగి తెలుసుకున్నారు.
పాత జ్ఞాపకాలు నెమరు
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, బిల్ గేట్స్తో తనకున్న పాత అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 1997లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిల్ గేట్స్ను కలిసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. నాడు ఐటీ రంగం కోసం వేసిన పునాదులు నేడు డిజిటల్ విప్లవానికి దారితీశాయని ఎక్స్ (X) వేదికగా పేర్కొన్నారు.
మొత్తానికి బిల్ గేట్స్ పర్యటన ఏపీలో టెక్నాలజీ, హెల్త్ కేర్ రంగాల్లో కొత్త పెట్టుబడులకు, ఉమ్మడి ప్రాజెక్టులకు ఊతమిస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
https://x.com/ncbn/status/2023330700439732579
https://x.com/ncbn/status/2023318110762045581
https://x.com/ncbn/status/2023295453761040489
https://x.com/ncbn/status/2023264382411792486
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Chiranjeevi | మెగా 158లో మోహన్లాల్.. కుమార్తెగా మలయాళ బ్యూటీ!
మే 21, 2026

Mega 158 | పవన్ కళ్యాణ్ క్లాప్తో మొదలైన చిరంజీవి మెగా 158 మూవీ – స్పెషల్ అట్రాక్షన్గా మలయాళ బ్యూటీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



