త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Train Timings | అధికారుల నిర్వాకం.. జమ్మికుంట రైల్వే స్టేషన్‌లో గందరగోళం

Train Timings | క‌రీంన‌గ‌ర్ జిల్లా జ‌మ్మికుంట‌లో (Jammikunta Railway Station) రైల్వే అధికారుల నిర్వాకం ప్ర‌యాణికుల‌ను ఇబ్బందికి గురిచేసింది. రైళ్ల రాకపోకల (Train Timings) సంబంధించిన‌ డిస్ ప్లే బోర్డులో ఒక రైలుకు సంబంధించిన వివ‌రాల‌కు బ‌దులు మ‌రో రైలు వివ‌రాల‌ను ప్ర‌ద‌ర్శించారు.

G

Telangana | Published On Jan 19, 2026, 11.53 am IST

Train Timings | అధికారుల నిర్వాకం.. జమ్మికుంట రైల్వే స్టేషన్‌లో గందరగోళం
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: క‌రీంన‌గ‌ర్ జిల్లా జ‌మ్మికుంట‌లో (Jammikunta Railway Station) రైల్వే అధికారుల నిర్వాకం ప్ర‌యాణికుల‌ను ఇబ్బందికి గురిచేసింది. రైళ్ల రాకపోకల (Train Timings) సంబంధించిన‌ డిస్ ప్లే బోర్డులో ఒక రైలుకు సంబంధించిన వివ‌రాల‌కు బ‌దులు మ‌రో రైలు వివ‌రాల‌ను ప్ర‌ద‌ర్శించారు. దీంతో స్టేషన్‌లోకి రైలు వచ్చిన‌ప్ప‌టికీ ప్ర‌యాణికులకు స‌రైన స‌మాచారం లేక‌పోవ‌డంతో గంద‌ర‌గోళానికి గుర‌య్యారు.

జమ్మికుంట రైల్వేస్టేషన్‌లో డిస్ ప్లే బోర్డుల్లో భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలుకు సంబంధించిన సమాచారం చూపాల్సి ఉండగా.. దక్షిణ ఎక్స్ ప్రెస్ వివ‌రాల‌ను ప్ర‌ద‌ర్శించారు. దీంతో భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్ ఫాం పైకి వచ్చిన‌ప్ప‌టికీ ప్రయాణికులు దానిని ఎక్క‌లేదు.

దీంతో రైల్వే స్టేషన్‌లో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. అయితే స్టేష‌న్‌లో ట్రేన్‌ను చూసిన ప్ర‌యాణికులు.. అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. దీంతో డిస్‌ప్లే బోర్డును స‌రిచేయ‌డంతో ప్యాసింజ‌ర్లు రైలు ఎక్కి త‌మ గ‌మ్య‌స్థానాల‌కు ప‌య‌ణ‌మ‌య్యారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement