త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nagarkurnool | ఇల్ల‌రికం అల్లుడు.. అర్ధ‌రాత్రి అత్త‌పై హ‌త్యాచారం

Nagarkurnool | బిడ్డ క్షేమం కోరి తాగుడుకు బానిస‌గా మారిన‌ అల్లుడిని ఇల్ల‌రికం తెచ్చుకుంది. అయినా కూడా అల్లుడి ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రాలేదు. చివ‌ర‌కు ఇల్ల‌రికం తెచ్చుకున్న అత్త‌పైనే అర్థరాత్రి వేళ అత్యాచారం చేసి కొట్టి చంపాడు.

S

Telangana | Published On Feb 10, 2026, 6.38 am IST

Nagarkurnool | ఇల్ల‌రికం అల్లుడు.. అర్ధ‌రాత్రి అత్త‌పై హ‌త్యాచారం
Advertisement

Nagarkurnool | త్రినేత్ర‌.న్యూస్ : బిడ్డ క్షేమం కోరి తాగుడుకు బానిస‌గా మారిన‌ అల్లుడిని ఇల్ల‌రికం తెచ్చుకుంది. అయినా కూడా అల్లుడి ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రాలేదు. చివ‌ర‌కు ఇల్ల‌రికం తెచ్చుకున్న అత్త‌పైనే అర్థరాత్రి వేళ అత్యాచారం చేసి కొట్టి చంపాడు. ఈ దారుణ ఘ‌ట‌న నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలోని క‌ల్వ‌కుర్తి మండ‌లంలో చోటు చేసుకుంది.

కల్వకుర్తి సీఐ నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామానికి చెందిన ఓ మహిళ తన కుమార్తెకు కొన్నాళ్ల క్రితం తిమ్మాజీపేట మండలానికి చెందిన ఓ వ్యక్తితో పెళ్లి చేసింది. కొన్నాళ్లు భార్యాభ‌ర్త‌ల సంసార జీవితం సాఫీగానే సాగింది. గ‌త కొద్ది నెల‌ల నుంచి అల్లుడు తాగుడుకు బానిసగా మారాడు. కుమార్తెను నిత్యం వేధింపుల‌కు గురి చేస్తున్నాడు. దీంతో ఇల్ల‌రికం తెచ్చుకుంటే అల్లుడు బాగుప‌డుతాడేమోన‌ని అత్త భావించింది. మొత్తానికి అల్లుడిని ఇల్ల‌రికం తెచ్చుకుంది.

మొద‌టికే మోసం తెచ్చిన ఇల్ల‌రికం

ఇక అత్తారింటికి వ‌చ్చిన అల్లుడిలో ఏ మాత్రం మార్పు రాలేదు. భార్య‌ను వేధింపుల‌కు గురి చేయ‌డ‌మే కాదు.. అత్త‌పై కామంతో క‌న్నేశాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో భార్య తన బంధువుల ఇంటికి వెళ్లింది. ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్తపై అత్యాచారం చేసిన అల్లుడు.. ఆపై కొట్టి చంపాడు. సోమవారం ఇరుగుపొరుగు వారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి రెండో కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు.

Advertisement
Advertisement