త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | వెల్‌డ‌న్ రుషిక‌.. సాధించి చూపించావ్‌

KTR | ఎప్‌సెట్-2026 ప‌రీక్ష‌ల్లో అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచి రాష్ట్రస్థాయిలో మొద‌టి ర్యాంక్ సాధించిన మ‌ల్లాడి రుషిక‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినంద‌న‌లు తెలిపారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ చేతుల మీదుగా రూ.ల‌క్ష విలువైన‌ చెక్కును అంద‌జేశారు.

S

Telangana | Published On May 19, 2026, 1.14 pm IST

KTR | వెల్‌డ‌న్ రుషిక‌.. సాధించి చూపించావ్‌
Advertisement
  • ఎప్‌సెట్ రాష్ట్ర మొద‌టి ర్యాంక‌ర్‌కు కేటీఆర్ అభినంద‌న‌
  • ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వ‌ర్యంలో ల‌క్ష రూపాయ‌ల చెక్కు అంద‌జేత‌

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: ఎప్‌సెట్-2026 ప‌రీక్ష‌ల్లో అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచి రాష్ట్రస్థాయిలో మొద‌టి ర్యాంక్ సాధించిన మ‌ల్లాడి రుషిక‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినంద‌న‌లు తెలిపారు. చిలుకానగర్ డివిజన్‌కు చెందిన కొండల్ రెడ్డి కుమార్తె మల్లాడి రుషిక‌ 156.63 మార్కులు సాధించారు. ఈ నేప‌థ్యంలో ఉప్ప‌ల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ చేతుల మీదుగా ఆ విద్యార్థినికి రూ.ల‌క్ష విలువైన‌ చెక్కును అంద‌జేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి కష్టపడి చదివి రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించడం ఎంతో గొప్ప విషయమన్నారు. రుషిక‌ విజయం చిలుకానగర్ డివిజన్‌తో పాటు మొత్తం ఉప్పల్ నియోజకవర్గానికి గర్వకారణమని పేర్కొన్నారు. నేటి యువత లక్ష్యసాధన కోసం పట్టుదలతో ముందుకు సాగితే ఎలాంటి విజయాన్నైనా అందుకోవచ్చని ఆమె నిరూపించిందని కొనియాడారు.

అలాగే విద్యార్థులు క్రమశిక్షణ, సమయపాలన, నిరంతర శ్రమతో చదివితే ఉత్త‌మ‌ ఫలితాలు సాధించవచ్చని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం, విద్యార్థి అంకితభావం కలిసి విజయానికి పునాది అవుతాయని పేర్కొన్నారు.

Advertisement
Advertisement