త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tenant Farmers Survey | రేపు కౌలు రైతుల స‌ర్వే రిపోర్ట్ వెల్ల‌డిస్తాం: కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ

Tenant Farmers Survey | హైద‌రాబాద్‌లోని బ‌షీర్‌బాగ్ ప్రెస్ క్ల‌బ్‌ వేదిక‌గా రేపు తెలంగాణ కౌలు రైతుల స‌ర్వే రిపోర్ట్ వెల్ల‌డిస్తామ‌ని కౌలు రైతుల గుర్తింపు సాధ‌న క‌మిటీ తెలిపింది. మే నెలలో కౌలు రైతుల విస్తృత సర్వే నిర్వహించామ‌ని పేర్కొంది.

S

Telangana | Published On Jun 8, 2026, 12.53 pm IST

Tenant Farmers Survey | రేపు కౌలు రైతుల స‌ర్వే రిపోర్ట్ వెల్ల‌డిస్తాం: కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ
Advertisement

Tenant Farmers Survey | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లోని బ‌షీర్‌బాగ్ ప్రెస్ క్ల‌బ్‌ వేదిక‌గా రేపు తెలంగాణ కౌలు రైతుల స‌ర్వే రిపోర్ట్ వెల్ల‌డిస్తామ‌ని కౌలు రైతుల గుర్తింపు సాధ‌న క‌మిటీ తెలిపింది. ఉద‌యం 10 గంట‌ల‌ నుండి ఒంటిగంట‌ వరకు కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. మే నెలలో కౌలు రైతుల విస్తృత సర్వే నిర్వహించామ‌ని పేర్కొంది. ఇందులో 22 జిల్లాలు, 47 మండలాలు, 57 గ్రామాల్లో 1816 మంది కౌలు రైతులను వ్యక్తిగతంగా కలిసి సర్వే నిర్వ‌హించిన‌ట్లు వెల్ల‌డించింది.

జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రొ. హరగోపాల్, ఎం.కోదండరెడ్డి, ప్రొ. కోదండరామ్, ఆకునూరి మురళి, డా.రుక్మిణీ రావు, తదితర ప్రముఖులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. సాధన కమిటీలో ఉన్న సంఘాల నాయకులు, సర్వేలో పాల్గొన్న కౌలు రైతులు తమ అనుభవాలను పంచుకుంటారు. ఈ సాధన కమిటీలో అనేక రైతు సంఘాలు, ప్రజా సంఘాలు భాగంగా ఉన్నాయి. ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త ప్రొ.డి.నరసింహా రెడ్డి ఛైర్మన్ గా ఉన్నారు అని క‌మిటీ తెలిపింది.

Advertisement
Advertisement