Smooth Coated Otter | స్వచ్ఛమైన నీటి వనరులే వాటి ఆవాసాలు.. బోథ్ అటవీ ప్రాంతంలో ప్రత్యక్షమైన అరుదైన జల ప్రాణులు
Smooth Coated Otter | అది ఓ అరుదైన ఉభయచరం.. ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జీవజాతుల్లో (Vulnerable Species) ఒకటి. స్వచ్ఛమైన నీరు ఉన్నచోట మాత్రమే అవి తమ ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటాయి. అలాంటి అరుదైన జీవులు ఇప్పుడు మన ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోనూ ప్రత్యక్షమయ్యాయి.
Smooth Coated Otter | త్రినేత్ర.న్యూస్: అది ఓ అరుదైన ఉభయచరం.. ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జీవజాతుల్లో (Vulnerable Species) ఒకటి. స్వచ్ఛమైన నీరు ఉన్నచోట మాత్రమే అవి తమ ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటాయి. అలాంటి అరుదైన జీవులు ఇప్పుడు మన ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోనూ ప్రత్యక్షమయ్యాయి. ‘స్మూత్ కోటెడ్ ఓటెర్’లుగా (Smooth Coated Otter) పిలిచే ఈ ఉభయచరాలను బోథ్ అటవీ రేంజి పరిధిలోని సొనాల మండలం గొల్లాపూర్ చెరువు వద్ద అటవీ అధికారులు గుర్తించారు.
ఈ అరుదైన జాతి జంతువులు శుభ్రమైన నీటి వనరులు, సమృద్ధిగా చేపలు లభించే ప్రదేశాల్లో కనిపిస్తాయని ఎఫ్ఆర్వో ప్రణయ్ చెప్పారు. వీటిని రక్షించేందుకు చెరువు వద్ద నిరంతర పర్యవేక్షణ, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాకిస్థాన్, చైనా, మలేసియా, ఇండోనేసియాలలో వీటి సమూహాలు ఎక్కువగా కనిపిస్తాయని తెలిపారు.
గతంలో కూడా ఈ ఉభయచరాలు హైదరాబాద్ శివార్లలో దర్శనమిచ్చాయి. 2020 మే నెలలో హిమాయత్సాగర్ జలాల్లో కనిపించాయి. నీటిపైనా, నేలమీదా ఉండగలిగే స్మూత్ కోటెడ్ ఓటెర్ను నీటి కుక్క అని కూడా పిలుస్తారు.
అంతరించిపోతున్న జాతుల్లో ఉన్న స్మూత్ కోటెడ్ ఓటర్లు మంచి నీరు ఉన్న చోటమాత్రమే ఉంటాయి. వీటి సంఖ్య ఎక్కువగా ఆగ్నేయాసియాలో కనిపిస్తుంది. ఇది 1996 నుంచి IUCN రెడ్ లిస్ట్లో అంతరించిపోతున్న జాతుల్లో ఉంది. వాతావరణ కాలుష్యం, పరిశ్రమల వల్ల స్వచ్ఛమైన నీరు ఎక్కువగా ఉండకపోవడం, చిత్తడి నేలల కాలుష్యం, అక్రమ వన్యప్రాణుల వ్యాపారం కోసం వేటాడటం వంటి ముప్పు పొంచి ఉండటంతో వీటిని ఆ జాబితాలో చేర్చారు. ఇవి 7 నుంచి 11 కిలోల బరువు, 59 నుంచి 64 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి.
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్పై కొడుకు.. క్లాస్లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం





