త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్ర‌మాదం.. ముగ్గురు మృతి

Road Accident | సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. క‌ల్లేర్ మండ‌లం బాచుప‌ల్లి వ‌ద్ద జ‌రిగిన ఈ ఘోర ప్ర‌మాదంలో ముగ్గురు మృతి చెందారు.

S

Telangana | Published On Jul 21, 2026, 7.39 am IST

Road Accident | సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్ర‌మాదం.. ముగ్గురు మృతి
Advertisement

Road Accident | త్రినేత్ర‌.న్యూస్ : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. క‌ల్లేర్ మండ‌లం బాచుప‌ల్లి వ‌ద్ద జ‌రిగిన ఈ ఘోర ప్ర‌మాదంలో ముగ్గురు మృతి చెందారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

అయితే మృతుల్లో ఇద్ద‌రు దంప‌తులు, వారి కుమార్తె ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ ముగ్గురు కూడా నాందేడ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కారులో వెళ్తుండ‌గా బాచుప‌ల్లి వ‌ద్ద రోడ్డు ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. కారు అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్ట‌డంతోనే ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement
Advertisement