Gutta Sukhendar Reddy | ఏసీబీకి పట్టుబడితే కఠిన శిక్షలు ఉండాలే
Gutta Sukhendar Reddy | ప్రభుత్వ అధికారుల్లో అవినీతి పెరిగిపోతోందని.. చిన్న చిన్న ఉద్యోగులు కూడా కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఏసీబీకి పట్టుబడిన వారికి కఠిన శిక్షలు అమలు చేయాలన్నారు.
- అధికారుల్లో అవినీతి పెరిగిపోతోంది
- చిన్న చిన్న ఉద్యోగులు కూడా కోట్లు వెనకేస్తున్నారు
- రిటైర్డ్ అయిన వారికి మళ్లీ పోస్టింగ్లు ఇవ్వొద్దు
- మీడియాతో చిట్ చాట్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి వ్యాఖ్యలు
Gutta Sukhendar Reddy | త్రినేత్ర.న్యూస్: ప్రభుత్వ అధికారుల్లో అవినీతి పెరిగిపోతోందని.. చిన్న చిన్న ఉద్యోగులు కూడా కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఏసీబీకి పట్టుబడిన వారికి కఠిన శిక్షలు అమలు చేయాలన్నారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు మళ్లీ పోస్టింగ్లు ఇవ్వొద్దని సూచించారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మీడియా మిత్రులతో ఆదివారం నిర్వహించిన చిట్ చాట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఎమ్మెల్యేకు పోటీ చేస్తే రూ.100 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నరు..
కోట్ల రూపాయలు, బంగారం లాకర్లలో దొరుకుతున్నాయి. ఏసీబీ కేసులో పట్టుబడిన వారికి కఠిన శిక్షలు అమలు చేయాలి. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. గతంలో రాజకీయాల్లో ఉండేవారు జెండా పట్టుకొని పని చేసేవారే ప్రజాప్రతినిధులుగా ఉండేది. కానీ ఇపుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు డబ్బున్న వారే రాజకీయ నాయకులుగా చెలామణి అవుతున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు.
అధికారులపై ప్రభుత్వానికి అజమాయిషీ ఉందా లేదా? చిన్న చిన్న చిన్న ఉద్యోగులు కూడా కోట్ల రూపాయలు వెనకేస్తున్నారు. 10% రాజకీయ నాయకులే డబ్బులు సంపాదిస్తారు. రైతు భరోసా విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలి. సేద్య యోగ్యమైన భూములకే రైతు భరోసా ఇవ్వాలి అని గుత్తా డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో పెరిగిపోతున్న ఖర్చుల కోసమే విపరీతమైన స్కాములు జరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు హయాం నుంచి విపరీతమైన ఎన్నికల ఖర్చులు పెరిగాయి. ఎన్నికల ఖర్చులు తగ్గించేందుకు పార్లమెంట్ స్థాయిలో పకడ్బందీగా చట్టాలు చేయాలి. ధరణిలో అవినీతి జరిగిందని అనుకుంటే భూభారతి వచ్చాక కూడా అవినీతి మరింత విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఏసీబీ దాడులు ఎన్ని జరిగినా అధికారులలో మార్పులు రావడం లేదని, కఠిన చట్టాలు తీసుకొచ్చి అవినీతి అధికారుల పని పట్టాలి అని ఆయన సూచించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●KTR | మీకు పట్టాలిచ్చే బాధ్యత మాది.. హనుమాన్ నగర్ బస్తీవాసులకు కేటీఆర్ భరోసా
- ●Women's Nations Cup | చరిత్ర సృష్టించిన హాకీ జట్టు.. 2-0 తేడాతో ఎఫ్ఐహెచ్ టైటిల్ కైవసం
- ●Krishank | మైనంపల్లికి సన్ స్ట్రోక్ ఉంది.. ఆయనకు మానసిక చికిత్స కూడా అవసరం
- ●Rashmika Mandanna | రెండు రోజుల్లోనే 53 కోట్లు - నెగెటివ్ టాక్తో కుమ్మేస్తోన్న రష్మిక మందన్న బాలీవుడ్ రొమాంటిక్ మూవీ
- ●NEET UG 2026 Re-Exam | నీట్ రీ-ఎగ్జామ్ పూర్తి : ఫిజిక్స్ టఫ్.. బయాలజీ ఈజీ.. విద్యార్థుల కోసం ప్రధాని మోదీ ఆసక్తికర నిర్ణయం
- ●Padma Devendar Reddy | మెదక్ ఎమ్మెల్యే రెండు స్పీడ్ బ్రేకర్లు వేసి 200 రీల్స్ పెట్టుకుంటున్నడు

KTR | మీకు పట్టాలిచ్చే బాధ్యత మాది.. హనుమాన్ నగర్ బస్తీవాసులకు కేటీఆర్ భరోసా

Women's Nations Cup | చరిత్ర సృష్టించిన హాకీ జట్టు.. 2-0 తేడాతో ఎఫ్ఐహెచ్ టైటిల్ కైవసం

Krishank | మైనంపల్లికి సన్ స్ట్రోక్ ఉంది.. ఆయనకు మానసిక చికిత్స కూడా అవసరం

Rashmika Mandanna | రెండు రోజుల్లోనే 53 కోట్లు - నెగెటివ్ టాక్తో కుమ్మేస్తోన్న రష్మిక మందన్న బాలీవుడ్ రొమాంటిక్ మూవీ




