Mahesh Kumar Goud | సర్వాయి పాపన్నను యువత చదవాలి.. ఆయన నాయకత్వ స్ఫూర్తిని ఆచరించాలి
Mahesh Kumar Goud | సర్ధార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్రను యువత అధ్యయనం చేయాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. ఆయన చూపిన ధైర్యం, ఆత్మగౌరవం, నాయకత్వ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోని సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
- జయంతి ఉత్సవాలు వేడుకలకే పరిమితం కావొద్దు
- వారి ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి
- పాపన్న జయంతి ఉత్సవాల్లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్
Mahesh Kumar Goud | త్రినేత్ర.న్యూస్: సర్ధార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్రను యువత అధ్యయనం చేయాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. ఆయన చూపిన ధైర్యం, ఆత్మగౌరవం, నాయకత్వ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోని సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జయంతి ఉత్సవాలు కేవలం వేడుకలకే పరిమితం కాకూడదని, మహనీయుల ఆశయాలను జీవితంలో ఆచరించడమే వారికి అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. రవీంద్ర భారతిలో సోమవారం నిర్వహించిన పాపన్న జయంతి ఉత్సవాల్లో మహేశ్కుమార్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
యోధుడే కాదు.. ప్రజా నాయకుడు కూడా..
ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడారు. సామాజిక సమానత్వం కోసం పోరాడిన గొప్ప వీరుడు, ధైర్యసాహసాలకు ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ ధర్మ పరిపాలన సంస్థ, జై గౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ జయంతి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సర్వాయి పాపన్న కేవలం ఒక యోధుడు మాత్రమే కాదని, అణగారిన వర్గాల హక్కుల కోసం, సామాన్య ప్రజల గౌరవం కోసం పోరాడిన ప్రజా నాయకుడని పేర్కొన్నారు. తన కాలంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక అసమానతలను ఎదుర్కొంటూ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారని అన్నారు.

ప్రజల కోసం పోరాడాలి.. అన్యాయాన్ని ఎదిరించాలి.. సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పాలనే స్ఫూర్తిని సర్వాయి పాపన్న గౌడ్ తన జీవితంతో చాటిచెప్పారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆయన ధైర్యం, నాయకత్వ లక్షణాలు, ప్రజల పట్ల ఉన్న నిబద్ధత నేటి తరానికి కూడా ఆదర్శంగా నిలుస్తాయని నొక్కి చెప్పారు.
చరిత్రలో ఎన్నో గొప్ప పోరాటాలు జరిగినప్పటికీ, పలువురు మహనీయులకు తగిన గుర్తింపు లభించలేదని ఆయన పేర్కొన్నారు. అలాంటి మహనీయుల చరిత్రను వెలుగులోకి తీసుకురావడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను భావితరాలకు అందించడంతో పాటు, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మధు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రామరావు గౌడ్, అరుణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Manne Krishank | లక్ష విలువ కూడా లేని కొండల్రెడ్డి కంపెనీకి.. వందల కోట్ల భూమిని 7 కోట్లకే కట్టబెట్టిండు
ఆగస్టు 10, 2026

Hidden Treasure | గుప్త నిధుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్..
ఆగస్టు 10, 2026

Chamala Kirankumar Reddy | పార్లమెంట్ సమావేశాలు ఇంకా నాలుగు రోజులే ఉన్నయ్.. అమిత్ షా హౌస్లోకి వస్తలేరు
ఆగస్టు 10, 2026
తాజావార్తలు
- ●Manne Krishank | లక్ష విలువ కూడా లేని కొండల్రెడ్డి కంపెనీకి.. వందల కోట్ల భూమిని 7 కోట్లకే కట్టబెట్టిండు
- ●VB-G RAM G | వీబీ జీరామ్జీ పథకం.. తొలి నెలలోనే సగానికి పడిపోయిన ఉపాధి పనిదినాలు
- ●అరవింద్ సుబ్రమణియంతో సీఎం భేటీ వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే: కన్స్ట్రక్షన్ రంగంపై రేవంత్ రెడ్డి పన్ను నిఘా!
- ●Hidden Treasure | గుప్త నిధుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్..
- ●Chamala Kirankumar Reddy | పార్లమెంట్ సమావేశాలు ఇంకా నాలుగు రోజులే ఉన్నయ్.. అమిత్ షా హౌస్లోకి వస్తలేరు
- ●Portronics Lithius Pro | పోర్ట్రోనిక్స్ కొత్త డబుల్ అండ్ ట్రిపుల్ ఎ సైజ్ బ్యాటరీలు.. యూఎస్బీ టైప్ సి తోనే ఛార్జింగ్..

Manne Krishank | లక్ష విలువ కూడా లేని కొండల్రెడ్డి కంపెనీకి.. వందల కోట్ల భూమిని 7 కోట్లకే కట్టబెట్టిండు

VB-G RAM G | వీబీ జీరామ్జీ పథకం.. తొలి నెలలోనే సగానికి పడిపోయిన ఉపాధి పనిదినాలు

అరవింద్ సుబ్రమణియంతో సీఎం భేటీ వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే: కన్స్ట్రక్షన్ రంగంపై రేవంత్ రెడ్డి పన్ను నిఘా!

Hidden Treasure | గుప్త నిధుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్..



