త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchandar Rao | విమోచ‌న స‌త్యాన్ని తెలంగాణ‌ ప్ర‌జ‌లు ఎన్నటికీ మ‌ర‌వ‌రు: రాంచంద‌ర్‌రావు

Ramchandar Rao | తెలంగాణ విమోచ‌నం కోసం జ‌రిగిన పోరాటాలు, త్యాగాలను తెలంగాణ ప్ర‌జ‌లు ఎన్న‌టికీ మ‌ర‌వ‌ర‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచ‌ద‌ర్‌రావు పేర్కొన్నారు.

S

Telangana | Published On Sep 15, 2026, 1.01 pm IST

Ramchandar Rao | విమోచ‌న స‌త్యాన్ని తెలంగాణ‌ ప్ర‌జ‌లు ఎన్నటికీ మ‌ర‌వ‌రు: రాంచంద‌ర్‌రావు
Advertisement

Ramchandar Rao | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ విమోచ‌నం కోసం జ‌రిగిన పోరాటాలు, త్యాగాలను తెలంగాణ ప్ర‌జ‌లు ఎన్న‌టికీ మ‌ర‌వ‌ర‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచ‌ద‌ర్‌రావు పేర్కొన్నారు. ఎంఐఎం భయంతో, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నిరాకరించడం సిగ్గుచేటని మండిప‌డ్డారు. తెలంగాణ విమోచన వేడుకల్లో భాగంగా మంగ‌ళ‌వారం నిర్వహించిన మహిళా శక్తి స్కూటీ ర్యాలీలో కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డితో క‌లిసి ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు.

రజాకార్ల రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఎంఐఎం ప్రభావానికి ఆ రెండు పార్టీలు త‌లొగ్గుతున్నాయి. హైదరాబాద్ విమోచన కోసం ప్రాణ త్యాగాలు చేసిన వీరులను సైతం సముచితంగా స్మరించేందుకు వెనుకాడుతున్నాయి. మన చరిత్రను గుర్తుంచుకోవడమే కాదు, తెలంగాణ విమోచన కోసం జరిగిన పోరాటాలు, త్యాగాల గురించి భావితరాలకు తెలియజేయడం అత్యంత అవసరం. ఈ చరిత్రను ప్రజల జ్ఞాపకాల నుంచి చెరిపివేయాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా ప్రజలు సత్యాన్ని ఎన్నటికీ మరవనివ్వరు.

నిజాం, రజాకార్ల పాలనలో తెలంగాణ మహిళలు ఎన్నో దారుణాలకు గురయ్యారు. నేడు అదే నేలపై నారీశక్తి ముందుండి, ఆత్మవిశ్వాసం, ధైర్యం, సంకల్పంతో ఉత్సాహభరితమైన స్కూటీ ర్యాలీకి నాయకత్వం వహించడం ఒక శక్తివంతమైన మార్పుకు ప్రతీక. అణచివేత నుంచి సాధికారత దిశగా ఇదే నవభారత స్ఫూర్తి అని రాంచంద‌ర్‌రావు వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement