Madhusudhana Chary | కక్షసాధింపులో భాగంగానే హరీశ్రావుకు నోటీసులు: మధుసూదనాచారి
Madhusudhana Chary | త్రినేత్ర.న్యూస్ : కక్ష సాధింపులో భాగంగానే మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao)కు నోటీసులు ఇచ్చారని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి (Madhusudhana Chary) ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా ముఖ్యమంత్రి (CM) రేవంత్రెడ్డి (Revanth Reddy) నిలబెట్టుకోలేకపోయారని మండిపడ్డారు.
Madhusudhana Chary | త్రినేత్ర.న్యూస్ : కక్ష సాధింపులో భాగంగానే మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao)కు నోటీసులు ఇచ్చారని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి (Madhusudhana Chary) ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా ముఖ్యమంత్రి (CM) రేవంత్రెడ్డి (Revanth Reddy) నిలబెట్టుకోలేకపోయారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీఆర్ఎస్ అంటే స్కీమ్ల ప్రభుత్వం అని, కాంగ్రెస్ అంటే స్కాముల ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ పోరాడుతున్నందుకే కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక పారిపోయారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. కుట్రలు, కుతంత్రాలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సందర్భంగా అనేక మందిని జైల్లో పెట్టిన పార్టీ టీడీపీ అని, రేవంత్రెడ్డి అప్పుడు టీడీపీలో ఉన్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన రైఫిల్రెడ్డి రేవంత్ అని నిప్పులు చెరిగారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమైన వ్యక్తి హరీశ్రావు అని చెప్పారు. రేవంత్రెడ్డి నిర్వాకాన్ని నిలదీసే రోజు ఆసన్నమైందన్నారు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే కుట్రపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. హరీశ్రావుకు నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజం అంతా కదిలివచ్చిందని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా రేవంత్రెడ్డి అవినీతిపై హరీశ్రావు ప్రశ్నిస్తూనే ఉంటారని ఉద్ఘాటించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



