త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anil Jadav | చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం విస్మరించింది

Anil Jadav | చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్ల‌రేష‌న్‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం విస్మ‌రించింద‌ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాద‌వ్ అన్నారు. ద‌ళిత గిరిజ‌నుల‌ను తీవ్ర మోసం చేశార‌ని విమ‌ర్శించారు.

S

Telangana | Published On Sep 12, 2026, 4.37 pm IST

Anil Jadav | చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం విస్మరించింది
Advertisement
  • సీత‌క్క తండ్రికి కేసీఆర్‌ ఐదెక‌రాల భూమి ఇచ్చారు
  • మాక్ అసెంబ్లీలో బోథ్‌ ఎమ్మెల్యే అనిల్ జాద‌వ్‌

Anil Jadav | త్రినేత్ర‌.న్యూస్: చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్ల‌రేష‌న్‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం విస్మ‌రించింద‌ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాద‌వ్ అన్నారు. ద‌ళిత గిరిజ‌నుల‌ను తీవ్ర మోసం చేశార‌ని విమ‌ర్శించారు. కేసీఆర్ హ‌యాంలో గిరిజ‌నుల‌కు పోడు భూములకు ప‌ట్టాలు ఇచ్చార‌ని.. సీత‌క్క తండ్రికి ఐదెక‌రాల భూమి ఇచ్చిన ఘ‌న‌త కేసీఆర్‌దేన‌ని గుర్తు చేశారు. శనివారం తెలంగాణ భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన‌ మాక్ అసెంబ్లీలో ఆయ‌న ప్ర‌సంగించారు.

పోడు భూములకు కేసీఆర్ రైతుబంధు ఇచ్చారు. కేసీఆర్ హ‌యాంలో పోడు భూముల‌కు ప‌ట్టాలు ఇస్తే ఈ ప్రభుత్వంలో పోడు భూములు సాగు చేయొద్దని గిరిజనలపై దాడులు చేస్తున్నారు. గిరిజనల విద్యార్థుల కోసం 71 గురుకుల పాఠశాలలు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది. తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారు. మంత్రి సీతక్క తండ్రికి ఐదు ఎకరాల భూమి ఇచ్చిన ఘనత కేసీఆర్ ది అని అనిల్ జాద‌వ్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement