త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGSPDCL | నేల‌కొరుగుతున్న విద్యుత్ తీగ‌లు.. ప్రాణాలు కోల్పోతున్న ప్ర‌జ‌లు.. టీజీఎస్పీడీసీఎల్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

TGSPDCL | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో గాలి వాన బీభ‌త్సం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. భారీ ఈదురుగాలుల నేప‌థ్యంలో న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేల‌కొరుగుతున్నాయి. దీంతో విద్యుత్ తీగ‌లు కూడా తెగిప‌డిపోతున్నాయి.

S

Telangana | Published On Jun 13, 2026, 5.06 pm IST

TGSPDCL | నేల‌కొరుగుతున్న విద్యుత్ తీగ‌లు.. ప్రాణాలు కోల్పోతున్న ప్ర‌జ‌లు.. టీజీఎస్పీడీసీఎల్ కీల‌క ప్ర‌క‌ట‌న‌
Advertisement

TGSPDCL | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో గాలి వాన బీభ‌త్సం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. భారీ ఈదురుగాలుల నేప‌థ్యంలో న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేల‌కొరుగుతున్నాయి. దీంతో విద్యుత్ తీగ‌లు కూడా తెగిప‌డిపోతున్నాయి. ఈ క్ర‌మంలోనే అల్వాల్‌లోని టెలికం కాల‌నీలో విద్యుత్ తీగ‌లు త‌గిలి తండ్రీకుమార్తె ప్రాణాలు కోల్పోయారు. దీంతో టీజీఎస్పీడీసీఎల్( TGSPDCL ) అప్ర‌మ‌త్త‌మైంది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి

ప్రకృతి వైపరీత్యాలు, భారీ గాలివానలు, వర్షాలు సంభవించిన సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. తెగిపోయిన విద్యుత్ వైర్లు, కూలిపోయిన విద్యుత్ స్తంభాలు లేదా విద్యుత్ సంబంధిత ప్రమాదకర పరిస్థితులు కనిపించిన వెంటనే టీజీఎస్పీడీసీఎల్ కాల్ సెంటర్ 1912కు సమాచారం అందించాలి. అలాగే సమీప టీజీఎస్పీడీసీఎల్ అధికారులకు తెలియజేయాలి. ప్రజలు స్వయంగా విద్యుత్ వైర్లు లేదా ఇతర విద్యుత్ పరికరాలను తాకేందుకు, తొలగించేందుకు లేదా మరమ్మత్తులు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించరాదు. ఇటువంటి చర్యలు ప్రాణహానికి దారితీయవచ్చు.

ఇట్లు

టీజీఎస్పీడీసీఎల్

Advertisement
Advertisement