త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Congress | దూర‌ద‌ర్శ‌న్ చానెల్ యాంక‌ర్‌పై కేసు న‌మోదు చేయండి.. పోలీసుల‌కు కాంగ్రెస్ ఫిర్యాదు

Telangana Congress | దూర‌ద‌ర్శ‌న్ చానెల్ యాంక‌ర్ అశోక్ శ్రీవత్స‌వ్‌పై కేసు న‌మోదు చేయాల‌ని తెలంగాణ యూత్ కాంగ్రెస్ లీగ‌ల్ సెల్ చైర్మ‌న్ గూడూరు నిఖిల్ రెడ్డి బేగంబ‌జార్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

S

Telangana | Published On Apr 15, 2026, 3.41 pm IST

Telangana Congress | దూర‌ద‌ర్శ‌న్ చానెల్ యాంక‌ర్‌పై కేసు న‌మోదు చేయండి.. పోలీసుల‌కు కాంగ్రెస్ ఫిర్యాదు
Advertisement

Telangana Congress | త్రినేత్ర‌.న్యూస్ : దూర‌ద‌ర్శ‌న్ చానెల్ యాంక‌ర్ అశోక్ శ్రీవత్స‌వ్‌పై కేసు న‌మోదు చేయాల‌ని తెలంగాణ యూత్ కాంగ్రెస్ లీగ‌ల్ సెల్ చైర్మ‌న్ గూడూరు నిఖిల్ రెడ్డి బేగంబ‌జార్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. లైబ్ డిబేట్‌లో అశోక్ శ్రీవ‌త్స‌వ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ సావర్క‌ర్ చెప్పు ధూళితో స‌మానమ‌ని అవ‌మాన‌క‌రంగా మాట్లాడారు. అనుచిత వ్యాఖ్య‌లు చేసిన అశోక్‌పై కేసు న‌మోదు చేయాల‌ని పోలీసుల‌ను కోరిన‌ట్లు నిఖిల్ రెడ్డి పేర్కొన్నారు.

యాంక‌ర్ అశోక్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌జ‌ల్లో మ‌రింత గంద‌ర‌గోళం రాకుండా ఉండేందుకు, అభ్యంత‌ర‌క‌ర కంటెంట్‌ను వెంట‌నే తొల‌గించాలి లేదా నియంత్రించాలి. ప్రజా శాంతి, న్యాయం, ప్రజాస్వామ్య గౌరవాన్ని కాపాడేందుకు అవసరమైన ఇతర చర్యలు కూడా తీసుకోవాలి అని పోలీసుల‌ను కోరిన‌ట్లు నిఖిల్ రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement