Heavy Rains | భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్లకు సీఎస్ కీలక ఆదేశాలు..
Heavy Rains | రాష్ట్రంలో రానున్న రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సూచించారు.
Heavy Rains | రాష్ట్రంలో రానున్న రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సూచించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం నుంచి కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక, వనమహోత్సవం కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఐదు నుంచి ఆరు జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైందని, మిగిలిన 26 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికను జిల్లాల్లో అమలు చేస్తున్నట్లు చెప్పారు.
రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు జిల్లాల వారీగా సీడ్ మేళాలు నిర్వహిస్తున్నామని, ప్రత్యామ్నాయ పంటల సాగుకు ముందుకొచ్చే రైతులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. అదే సమయంలో ఐఎండీ తాజా అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా రానున్న రెండు రోజుల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రధాన కార్యదర్శి సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ విపత్తు నిర్వహణ చర్యలను సమర్థంగా అమలు చేయాలని ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం (భద్రాచలం), ములుగు, నిర్మల్ జిల్లాల్లో ఇప్పటికే జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. అవసరమైతే హైదరాబాద్తో పాటు ఇతర కేంద్రాల్లో ఉన్న అదనపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ప్రభావిత ప్రాంతాలకు వెంటనే తరలించేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, కార్యదర్శులు దాసరి హరిచందన, సురేంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

E20 Petrol Impact | ఈ20 పెట్రోల్ వినియోగంపై సందేహాలు.. వివరణ ఇచ్చిన కేంద్రమంత్రి గడ్కరీ..!
జులై 29, 2026

AK47 | ‘ఆదర్శ కుటుంబం’లో వెంకటేశ్ కూతురిగా యువినా పార్థవి.. నవ్వులు పంచుతున్న గ్లింప్స్..!
జులై 29, 2026

LIC Dividend | మోదీ ప్రభుత్వానికి ఎల్ఐసీ బోనాంజా.. రూ.12,207 కోట్ల డివిడెండ్
జులై 29, 2026
తాజావార్తలు
- ●E20 Petrol Impact | ఈ20 పెట్రోల్ వినియోగంపై సందేహాలు.. వివరణ ఇచ్చిన కేంద్రమంత్రి గడ్కరీ..!
- ●Google | ఆటోమేటిక్ ఏఐ ఏజెంట్ను లాంచ్ చేసిన గూగుల్.. యూజర్ల పనులన్నీ వేగంగా పూర్తి చేస్తుంది..
- ●AK47 | 'ఆదర్శ కుటుంబం'లో వెంకటేశ్ కూతురిగా యువినా పార్థవి.. నవ్వులు పంచుతున్న గ్లింప్స్..!
- ●Vande Mataram Bill | వందేమాతరం బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. విపక్ష సభ్యుల వాకౌట్
- ●Cyberabad | వాటర్ లాగింగ్ను నివారించండి.. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూడండి
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. సెన్సెక్స్ 888, నిఫ్టీ 264 పాయింట్లు పైకి..

E20 Petrol Impact | ఈ20 పెట్రోల్ వినియోగంపై సందేహాలు.. వివరణ ఇచ్చిన కేంద్రమంత్రి గడ్కరీ..!

Google | ఆటోమేటిక్ ఏఐ ఏజెంట్ను లాంచ్ చేసిన గూగుల్.. యూజర్ల పనులన్నీ వేగంగా పూర్తి చేస్తుంది..

AK47 | 'ఆదర్శ కుటుంబం'లో వెంకటేశ్ కూతురిగా యువినా పార్థవి.. నవ్వులు పంచుతున్న గ్లింప్స్..!

Vande Mataram Bill | వందేమాతరం బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. విపక్ష సభ్యుల వాకౌట్



